ఆర్థిక సమస్యలతో కుమిలిపోతున్న భర్త...ఏ భర్త తీసుకోలేని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తాను...  తనతో పాటు తన భార్యను కూడా ఇబ్బందికి గురి చేయడం ఇష్టం లేక.. చనిపోతున్నాను అని...  తన భార్యకు వేరే పెళ్లి చేయండి అంటూ సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు ఇక్కడ ఓ వ్యక్తి. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే... ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న సూర్యాపేటకు చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి... ఆత్మహత్య చేసుకోవాలని భావించి తన తండ్రి ఉద్దేశించి... తన భార్యకు రెండో వివాహం చేయాలి అంటూ సూసైడ్ నోట్లో రాశాడు.రెండో  వివాహ జరిపి తన భార్య  ఆనందంగా ఉండేలా చూడాలి  అంటూ లేఖలో  తెలిపాడు. తనకి రావాల్సిన అప్పుల వివరాలను కూడా ఆ లేఖలో తెలిపారు. 

 

 

 2009 సంవత్సరంలో సూర్యాపేటకు చెందిన శ్రవణ్ కుమార్ కు హరిత అనే యువతితో వివాహం జరిగింది. శ్రవణ్ కుమార్ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ హెచ్డిఎఫ్సి బ్యాంకులో డిప్యూటీ మేనేజర్గా పని చేస్తున్నాడు. కాగా ప్రస్తుతం దంపతులిద్దరూ ఓ అద్దె ఇంటిలో ఉంటున్నారు. శ్రవణ్ కుమార్ గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నాడు. మానసికంగా ఎంతగానో కుంగిపోయిన అతను.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు... దీన్ని గమనించిన భార్య హారతి అతడిని ఆసుపత్రికి తరలించింది...  ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. 

 

 

 కాగా శ్రవణ్ కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడానికి ముందే తన తండ్రిని ఉద్దేశించి ఓ లేఖ రాశాడు. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో తాను ఇచ్చిన అప్పులను వసూలు చేసుకోవాలని అందుకు తన స్నేహితులు కూడా సహకరించాలి అంటూ లేఖలో కోరాడు . అంతేకాకుండా తనకు ఎండో  డబ్బులు కూడా రావాల్సి ఉన్నాయని వాటి తో తన అంత్యక్రియలు జరపాలని ... తన భార్యకు రెండో వివాహం చేసి ఆనందంగా ఉండేలా చూడాలి అంటూ తండ్రిని కోరాడు శ్రవణ్ కుమార్. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నామని తెలిపారు. ఇక బాధితుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నట్లు  వెల్లడించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: