దిశ కేసు తరహాలో ఓ భయంకర అత్యార సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు కుర్రాళ్లు.. ఓ ప్లాన్ ప్రకారం ఓ వివాహితపై అత్యాచారం చేశారు. పక్కాగా ప్రణాళిక వేసుకుని ఆమె జీవితంతో ఆటలాడారు. అసలేం జరిగిందంటే.. “ రఘునాథపాలెం మండలానికి చెందిన వివాహిత శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తోంది. రాత్రి 10 గంటల తరువాత ఇద్దరు యువకులు రహస్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. ఆమెను నోట్లో గుడ్డలు కుక్కి.. బలవంతంగా బైక్ పై తీసుకెళ్లారు. అరవకుండా నోరు అదిమిపెట్టేశారు.

 

వీరికి తోడు దారిలో మరికొందరు యువకులు తోడయ్యారు. అంతా కలిసి ఆమెను అదే మండలం హర్యాతండాలోని పత్తి చేనులోకి తీసుకెళ్లారు. ఆమెపై ఒకరి తర్వాత మరొకరు దారుణంగా అత్యాచారం చేశారు. అయితే వీరు వివాహితను ఎత్తుకెళ్లడం గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చేసరికి అంతా అయిపోయింది.

 

తనపై జరిగిన అత్యాచారాన్ని ఆమె పోలీసులకు కన్నీళ్లతో వివరించింది. హర్యాతండాకు చెందిన బాణోతు మోహన్‌, బాణోతు ఉపేందర్‌, అంగోతు కల్యాణ్‌, బాణోతు చంటి, అజ్మీరా నాగేశ్వరరావు, సుకినీ తండాకు చెందిన మాలోతు అశోక్‌, బి. సునీల్‌ అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ మేరకు ఫిర్యాదు చేసింది. అడిషినల్‌ డీసీపీ ఇంజారపు పూజ, రూరల్‌ ఏసీపీ వెంకట్‌రెడ్డి తదితరులు శనివారం అత్యాచారం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.

 

నిందితులు ముందుగానే ఆ ప్రదేశాన్ని ఎంచుకుని.. అదే ప్రాంతంలో మద్యం తాగినట్టు కూడా గుర్తించారు. వివాహితపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఈ ఘటన ఖమ్మం జిల్లాలో కలకలంరేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి విచారణ ప్రారంభించిన పోలీసులు ఒకర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: