మానవ సంబంధాలు తెగిపోయాయి అనే చెప్పాలి.. వావి వరసలు లేవు.. ఏ తండ్రి అయినా..  పెద్దనాన్నఅయిన బాబాయ్ అయినా కూతురుని ఎలా చూసుకుంటారు.. కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు.. జెమినీ టీవీ సీరియల్ లో ఉండే బంధాలు ఉంటాయి. కానీ ఇక్కడ అలాంటి బంధాలు ఏమి లేవు.. అసలు చెప్పాలి అంటే వావి వరసలు లేవు..  

            

వావివరసలు మర్చిపోయిన ఓ కామాంధుడు చేసిన పని బంధాలకే మచ్చ తెచ్చే దానిలా మారిపోయింది. సొంత తమ్ముడు కూతురు.. అతనికి కూతురు. అలాంటి కూతురుపై కన్నేశాడు ఓ నీచ నికృష్టుడు. అసలు వీడు మనిషేనా? అనే సందేహాన్ని కల్గుతుంది ఈ నీచుడు చేసిన పని చూస్తే.. 

             

అనంతపురం జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవోదయ కాలనీకి చెందిన బాలిక పదో తరగతి చదువుతుంది. అయితే ఆ బాలికను వరసకు పెదనాన్న అయ్యే వ్యక్తి కొద్దికాలంగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇన్నాళ్లు ఎవరికైన చెప్తే పరువు పోతుంది అని భయపడి మౌనంగా ఉన్న బాలిక వేధింపులు ఎక్కువ అవ్వడంతో తల్లితండ్రులకు విషయం అంత చెప్పేసింది.  

 

దీంతో.. కూతురు వయసు ఉన్న బాలికపై అగ్యాత్యానికి పాల్పడిన కామాంధుడిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ నిందుతుడిని అదుపులోకి తీసుకొని.. బాలికకు వైద్య పరీక్షలు చేయించారు. అయితే ఆ వైద్య రిపోర్టుల ప్రకారం అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది తెలుస్తుంది. 

 

కాగా.. దిశ లాంటి చట్టాలు తెచ్చినప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇలాంటి ఘటనలకు ఎప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి.. కామాంధులను ఆపాలి అంటే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: