ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు తన మరదలితో బెడ్రూమ్ లో రాసలీలలు సాగిస్తున్న సమయంలో ఈ విషయం తెలిసిన అతని మేనమామ అతడిని దారుణంగా చంపేశాడు. యువకుడిని గొంతు నులిమి కొడుకు సహాయంతో దారుణంగా చంపేసిన మేనమామ ఆ తరువాత యువకుడి శవాన్ని రైల్వే ట్రాక్ దగ్గర పడేశాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. 
 
పూర్తి వివరాలలోకి వెళితే 26 సంవత్సరాల వయస్సు గల లారీ క్లీనర్ గా పని చేస్తున్న యువకుడు గత కొన్ని సంవత్సరాల నుండి తన మరదలిని ప్రేమిస్తున్నాడు. గత మంగళవారం రాత్రి దొంగాచాటుగా మరదలి గదిలోకి వెళ్లిన యువకుడు మరదలికి మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. యువతి గదిలోనుండి శబ్దం రావడం యువతి తండ్రికి మెలుకువ వచ్చింది. 
 
యువతి గదిలోకి వచ్చి లైట్ వేసిన తండ్రి అక్కడ కూతురితో రాసలీలలు సాగిస్తున్న మేనల్లుడిని చూసి షాక్ అయ్యాడు. మేనల్లుడిపై ఆగ్రహానికి గురైన యువతి తండ్రి మేనల్లుడిని చితకబాది ఆ తరువాత మేనల్లుడి గొంతు నులిమి చంపేశాడు. ఆ తరువాత కొడుకు సాయంతో శవాన్ని తీసుకెళ్లి రైల్వే ట్రాక్ పై పడేశారు. యువకుడి తల్లిదండ్రులు కొడుకు ఇంటికి రాకపోవడంతో సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా రైల్వే ట్రాక్ దగ్గర యువకుడి శవాన్ని పోలీసులు గుర్తించారు. యువకుడి కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు యువకుడు తన మరదలితో ఎక్కువసార్లు మాట్లాడినట్లు గుర్తించారు. యువకుడి మరదలిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తన అన్న, తండ్రి కలిసి బావను చంపేశారని యువతి పోలీసులకు చెప్పింది. పోలీసులు యువతి తండ్రి, అన్నను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. మృతుడి తల్లిదండ్రులు తన కొడుకును అన్యాయంగా పొట్టన పెట్టుకున్నవారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: