తెలంగాణ ప్రజలు, నాయకులు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చుసిన ఫలితాలు వచ్చేశాయ్. ఆ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మునుపెన్నడూ.. దేశంలో ఎక్కడ కుడా ఇలాంటి విజయం సాధించి ఉండరు. అలాంటి విజయాన్ని సొంతం చేసుకుంది టిఆర్ఎస్ పార్టీ. రెండు జాతీయ పార్టీలు ఉన్న రెండు పార్టీలను అణగతొక్కి విజయం సాధించాడు కేసీఆర్.
ఏ రాష్ట్రంలో చుసిన ప్రతిపక్షలు గోల గోల చేస్తుంటే ఇక్కడ అసలు ప్రతిపక్షాన్నే అంతం చేస్తున్నాడు సీఎం కేసీఆర్. ముండిగా ఉన్న ప్రజల మనసు గెలుచుకొని తెలంగాణను ముందడుగు వేయిస్తున్నాడు. నిజానికి ఈ గెలుపును టిఆర్ఎస్ పార్టీ కూడా ఉహించి ఉండదు.. అంతటి విజయాన్ని టిఆర్ఎస్ సాధించింది.
ఎవరూ ఊహించని విధంగా అధికార పార్టీ టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసేసింది. ఇంత భారీ విజయం బహుశ దేశంలోని ఏరాష్ట్రంలోనూ ఏ పార్టీకి దక్కలేదని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అయితే ఫలితాలు ఏ ప్రస్థానానికి దారితీస్తాయి? అనేది ప్రస్తుతం ప్రశ్నార్ధం అయ్యింది. ఎందుకు అంటే.. సీఎం కేసీఆర్ గెలుపు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం.
ఈ ఫలితాలు వాళ్లలో అహాన్ని పెంచుతాయా? లేక ప్రజలకు మరింత సేవ చేస్తారా ? అనేది ప్రశ్నార్ధకమే. సాధించింది చూసుకొని ప్రజలకు సేవ చెయ్యడం మారుస్తారా? అని ప్రజలు కూడా ప్రశ్నించుకుంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి గెలుపు ఎవరికి సాధ్యం కాదు.. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి సాధ్యం అయ్యింది.
కాబట్టి.. ఈ విజయాన్ని ప్రజలకు మరింత సేవ చెయ్యడానికి వినియోగిస్తే టిఆర్ఎస్ పార్టీ ఫలితాలలో ఎలా దేశంలో 1 ఉందొ..అలానే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1స్థానంలో ఉంటుంది. తెలంగాణను మంచి అభివృద్ధి చేయవచ్చు.. లేదు మాకు తిరుగు లేద అనుకుంటే నియంతృత్వానికి దారి తీసే ఛాన్స్ ఉందని మేథావులు అంటున్నారు. మరి చివరికి తెలంగాణ పరిస్థితి ఎం అవుతుందో చూడాలి.