శాసన మండలిని కొనసాగించాలా రద్దు చేయాలా అన్న ఆలోచనలో వైసీపీ ఉంది. నేడు ఆ విషయంపై క్లారిటీ వచ్చేస్తుంది. అయితే మొత్తానికి పదవి పోగొట్టుకోవడం కంటే వైసీపీ వైపు వెళ్తే కనీసం పదవి అయినా ఉంటుందని టీడీపీ ఎమ్మెల్సీలు ఆలోచిస్తున్నారట. అందుకే ఇలాంటి గోడ దూకేవారిపై చంద్రబాబు కంగారుగా ఉన్నారు. అందుకే ముందుగానే వైసీపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. తమ పార్టీ ఎమ్మెల్సీలకు డబ్బు, పదవులు ఎరవేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు.

 

అంతే కాదు.. తమ పార్టీ ఎమ్మెల్సీలను కాపాడుకునే బాధ్యతను సీనియర్ నేతలు యనమల, అచ్చెన్నకు అప్పగించారట చంద్రబాబు. ఇప్పుడు వారిద్దరూ తంటాలు పడుతున్నారు. తమ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీ లతో కొందరు మంత్రులు, అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు సంప్రదింపులు జరుపుతున్నారని, డబ్బు, పదవులు ఎర వేస్తున్నారని టీడీపీ ప్రచారం చేస్తోంది. ఇందుకు డైరెక్టుగా పేరు చెప్పకుండా ఓ ఉదాహరణ కూడా చెబుతోంది.

 

 

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక టీడీపీ ఎమ్మెల్సీతో వైకాపా నేతలు మాట్లాడారట.. పార్టీలోకి వస్తే రూ.5 కోట్లు, మండలిలో ప్రభుత్వ విప్ పదవి ఇస్తామని ఆశ పెట్టారట. వచ్చే ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఆయన కుటుంబానికి చెందిన వారికే అవకాశమిస్తామని చెప్పారట. ఈ విషయాన్ని టీడీపీ అనుకూల పత్రికే బయటపెట్టింది కూడా.

 

ఆయనలాగే మరికొందరు ఎమ్మెల్సీల తోనూ మాట్లాడే బాధ్యతను వైసీపీ కొందరుమంత్రులకు అప్పగించిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. తమ ఎమ్మెల్సీలెవరూ జారిపోకుండా టీడీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబే ఎమ్మెల్సీలతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి బుజ్జగిస్తున్నారట. ఎమ్మెల్సీలతో నిరంతరం మాట్లాడి, పార్టీ వెంట నిలబడేలా చూసే బాధ్యతను శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, శాసనసభలో తెదేపాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడులకు అప్పగించారు. మరి వీరు ఏమేరకు సక్సస్ అవుతారో.

మరింత సమాచారం తెలుసుకోండి: