వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మండలి రద్దుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు చంద్రబాబు. దీంతో ఆ వ్యాఖ్యలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. అంతేకాదు.. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మండలిని తీసుకొస్తా అంటే డబ్బులు దండగ అన్న చంద్రబాబు ఇప్పుడు రద్దు చేస్తే అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళి తెస్తా అని అంటున్నాడు అంటూ మండిపడ్డారు విజయసాయి రెడ్డి.    

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ.. ''అప్పట్లో కౌన్సిల్ ను పునరుద్ధరించాలని డా.వైఎస్సార్ ప్రతిపాదించినపుడు ఇదే చంద్రబాబు డబ్బులు దండగ అన్నాడు. సిఎం జగన్ గారు కౌన్సిల్ వల్ల ఖర్చు తప్ప ప్రయోజనం లేదనగానే, మీరు రద్దు చేస్తే నేనొచ్చాక మళ్లీ తెస్తా అని బట్టలు చించుకుంటున్నాడు. విజనరీది మాట మీద నిలకడ లేని బతుకు.'' అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు విజయసాయి రెడ్డి.

 

అయితే ఈ ట్విట్ చుసిన నెటిజన్లు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. సర్ చంద్రబాబు వద్ద నుండి అలాంటివి అన్ని మీరు ఎక్సపెక్ట్ చెయ్యకండి.. ఫీల్ అవుతారు అని ఒకరు ట్విట్ చేస్తే.. మరొకరు స్పందిస్తూ ''చంద్రబాబు ఏరోజు మాటమీద నిలబడ్డాడు సార్. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకునే రకం. తనకి ఊడిగం చేయడానికి మాత్రమే మండలి. అది ఉండటం వల్ల ఎవరికి ప్రయోజనం. ప్రజలకు ఉపయోగపడే, విద్యార్థులకు ఉపయోగపడే బిల్లులను అడ్డుకునే మండలి ఎవడికీ కావాలి. ప్రజల కోసం పనిచేయని మండలిని తక్షణమే రద్దు చేయాలని నా మనవి.'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నెటిజన్లు. దీంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: