బడ్జెట్‌ ఫోన్లలోనే అన్ని ఫీచర్లు అందుబాటులోకి రావడం, కంపెనీల మధ్య విపరీతమైన పోటీ... పోటీ ప‌డీ మ‌రీ ఆఫ‌ర్ల అమ్మకాలతో స్మార్ట్‌‌ఫోన్ల అమ్మకాల్లో ఇండియా అమెరికాను మించిపోయింది!! గత ఏడాది స్మార్ట్‌‌ఫోన్‌ మార్కెట్‌ 15.8 కోట్ల షిప్‌మెంట్లను రికార్డు చేసిందని కౌంటర్‌‌ పాయింట్‌ రీసెర్చ్‌ స్టడీ తెలిపింది. 2018తో పోలిస్తే గత ఏడాది షిప్‌మెంట్ల సంఖ్య ఏడుశాతం పెరిగింది. ఇప్పటికీ చైనా ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్‌ మార్కెట్‌ కాగా, ఇండియా, అమెరికాలు రెండు, మూడుస్థానాల్లో ఉన్నాయి. చైనా కంపెనీలు ఫ్లాగ్‌ షిప్‌ గ్రేడ్‌ ఫీచర్లను మిడ్‌ రేంజ్‌ ఫోన్లలోనే ఇస్తుండటంతో అమ్మకాలు విపరీతంగా పెరిగాయని ఇది విశ్లేషించింది. ఇండియాలో చాలా మంది ఫీచర్‌‌ ఫోన్‌ యూజర్లు స్మార్ట్‌‌ఫోన్‌ కొంటున్నారు కాబట్టి వీటికి మరింత డిమాండ్‌ పెరుగుతుందని మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థలు చెబుతున్నాయి. పెరుగుదలకు దోహదపడుతుందని అంటున్నాయి.

 


చైనా కంపెనీలు ఫ్లాగ్‌ షిప్‌ గ్రేడ్‌ ఫీచర్లను మిడ్‌ రేంజ్‌ ఫోన్లలోనే ఇస్తుండటంతో అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. షావోమీ నంబర్‌ వన్‌‌ఇండియా స్మార్ట్‌‌ఫోన్ల మార్కెట్‌లో గత ఏడాది షావోమీ మొదటిస్థానంలో నిలిచింది. మార్కెట్‌ షేర్‌‌ను ఏకంగా 28 శాతానికి పెంచుకుంది. శామ్‌సంగ్‌కు 21 శాతం, వివోకు 16 శాతం, రియల్‌ మీకి 10 శాతం, ఒప్పోకు తొమ్మిది శాతం వాటా ఉన్నట్టు కౌంటర్‌‌ పాయింట్‌ ప్రకటించింది. అయితే గత ఏడాది చివరి క్వార్టర్‌‌లో వివో.. శామ్‌సంగ్‌ను దాటేసి రెండో స్థానాన్ని ఆక్రమించింది. డిసెంబరు క్వార్టర్‌‌లో షావోమీ మొదటి స్థానానికి ఎగబాకింది. 2018లో ఇండియాలో చైనా స్మార్ట్‌‌ఫోన్‌ బ్రాండ్ల వాటా 60 శాతం కాగా, గత ఏడాది ఇది 72 శాతానికి చేరింది. రిటైల్, ఆన్‌లైన్‌ ప్లాట్‌ ఫామ్‌ల ద్వారా ఇవి మార్కెట్‌ షేర్‌‌ను పెంచుకున్నా యి. షావోమీ, రియల్‌ మీ, వన్‌ ప్లస్‌లు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ అమ్మకాలను పెంచుకోగలిగాయి. జెడ్‌, యూ సిరీస్‌ ఫోన్ల ద్వారా వివో ఆన్‌లైన్‌ వాటానుపెంచుకుంది. 

 

 


కౌంటర్ పాయింట్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌‌ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ, ‘‘ఇతర టెలికాం మార్కెట్లతో పోలిస్తే ఇండియాలో స్మార్ట్‌‌ఫోన్ల వాడకం కాస్త తక్కువగానే ఉంది. మొత్తం స్మార్ట్‌‌ఫోన్‌ యూజర్లలో 4జీ వాడకం దారుల వాటా 55 శాతం వరకు ఉంది’’ అని వివరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: