ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి  అభిమానుల సంఖ్య భారీగా ఉంటుందన్న విషయం తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి  పార్టీ తో  కొంతమంది అభిమానులైతే... జగన్మోహన్ రెడ్డి  ఎజెండా చూసి  కొంత మంది అభిమానులు అవుతారు. జగన్మోహన్ రెడ్డి ప్రసంగానికి  కొంతమంది అభిమానులు అయితే... జగన్మోహన్ రెడ్డి లక్ష్యాలు నచ్చి ఇంకొంతమంది అభిమానులు. ఇలా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నే కాదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే సినిమా వాళ్లకి రాజకీయ నాయకులకి అభిమానులు ఉండటం కామనే. తమకు తమ ప్రియతమ హీరోలు రాజకీయ నాయకుల పై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటేందుకు అభిమానులు ఎన్నో ప్రయత్నాలు.

 

 

 ఇప్పటికే ఎంతోమంది అభిమానులు తమ అభిమాన నేతపై  వ్యక పై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకుని వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి వీరాభిమాని అయిన ఓ వ్యక్తి తనకు జగన్ మోహన్ రెడ్డి పై ఉన్న అభిమానాన్ని చాటుకుని  ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు. వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తనకున్న అభిమానాన్ని గుంటూరు జిల్లాకు చెందిన చిల్డ్రన్ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా సభ్యుడు శంకరయ్య వినూత్నంగా చాటుకున్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పర్వతం మైన  కిలిమంజారో పర్వతం అధిరోహించాడు కే శంకరయ్య. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అనంతరం... జగన్మోహన్ రెడ్డి పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ఆ పర్వతంపై జగన్ చిత్రపటాన్ని ప్రదర్శించాడు. 

 

 

 శీలం ఈశ్వరయ్య అనే డిగ్రీ విద్యార్థులతో కలిసి టాంజానియా చేరుకున్నాడు శంకరయ్య. 23వ తేదీ ఉదయం 10 గంటలకు వారు పర్వతాన్ని అధిరోహించారని   కిలిమంజారో క్లబ్ ఓ ప్రకటన విడుదల చేసింది. జాతీయ జెండా ని సైతం శంకరయ్య అక్కడ ఎగురయగ.. సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని కూడా చాటుతూ జగన్ చిత్రపటాన్ని కూడా ప్రదర్శించారు. ప్రస్తుతం ఆయన అనంతపురం జిల్లాలోని ఆర్టిసి స్వచ్ఛంద సంస్థలో స్పోర్ట్స్ కోచ్గా పనిచేస్తున్నారు. జగన్ పై తనకున్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటి చెప్పి వార్తల్లోకెక్కిన శంకరయ్య పై ప్రస్తుతం జగన్ అభిమానులు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: