శాసన మండలి వద్ద కు సంబంధించి టిడిపి ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఈరోజు లోకేష్ తీరు చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది అంటూ వ్యాఖ్యానించి రోజా... బయటకి వచ్చి ఏదో సాధించే చేసినట్లుగా.. శాసన మండలి రద్దు చేస్తారా దమ్ముంటే చేయండి లోకేష్ వ్యాఖ్యానిస్తున్నారు అని తెలిపారు. బాగా బలిసిన కోడి చికెన్ షాపు ముందుకు వెళ్లి తొడ కొడితే ఏమవుతుంది... కోసి కారం ఉప్పు పెట్టి కూర వండేస్తారు... ఈ విషయాన్ని లోకేష్ తెలుసుకుంటే మంచిది అంటూ వ్యాఖ్యానించారు నగరి ఎమ్మెల్యే రోజా. 

 

 

 టిడిపిలో ఇంకో మహామేధావి అయినా యనమల రామకృష్ణుడు పై ప్రజల తీర్పు ఏమిటి... రెండుసార్లు యనమల రామకృష్ణుడు ని ఆయన తమ్ముడిని ప్రజలు ఓడించడం మనం కళ్లారా చూశాం... ప్రజలు అంత అసహ్యించుకుంటున్నప్పటికీ...  యనమల రామకృష్ణుడు ప్రపంచ మేధావిల  ఫీలవుతూ వుంటారు అంటూ సెటైర్ వేసారు ఎమ్మెల్యే రోజా. ప్రపంచ మేధావిలా ఫీల్ అవుతూ ప్రజా తీర్పును అవమానించేలా మండలిలో యనమల రామకృష్ణుడు ప్రవర్తిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శాసనసభలో జగన్మోహన్ రెడ్డి సర్కారు శాసన మండలి రద్దు పై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్న అనేది ఉత్కంఠగా మారింది.

 

 

 ప్రజలు వైసీపీ పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి 151 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసి... అభివృద్ధి పరమైన కీలక నిర్ణయాలు అమలు చేయకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ సంకల్పానికి అడ్డు తగిలితే దేన్నయినా తప్పించాల్సిందే అంటూ  శాసన మండలి రద్దు ను ఉద్దేశించి మాట్లాడారు. ఎంతో  గొప్పదైన శాసనమండలి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న వారికి ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారని... అయినప్పటికీ వారికి ఇంకా బుద్ధి రాక అదే పద్ధతిలో వెళ్తున్నారు అంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: