పాపం.. చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీలో లేడు కానీ ఉంటె ఏడ్చేసేవాడు.. 70 ఏళ్ళు వచ్చాయి కానీ అవమానాలకు కేర్ అఫ్ నిలిచారు. 2019 నుండి ఆయనకు అవమానాలు జరుగుతూనే ఉన్నాయి.. ఆ అవమానాలకు తగ్గట్టు పైపైన ఏదో ఒక అలజడి సృష్టించడం.. అల సృష్టించిన అలజడికి సీఎం జగన్ చెక్ పెట్టడం టామ్ అండ్ జెర్రీ ఆటలు అయిపోయాయి. 

                   

అయితే ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ మొదటిసారి అసెంబ్లీలో చంద్రబాబుపై డైలుగులు వేశారు.. ఆ డైలాగులు వింటే వావ్ అని అనాలసిందే.. పొట్ట చక్కలు అవ్వాల్సిందే.. ఆ సంచలన వ్యాఖ్యలు ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.. అప్పట్లో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ని సింగపూర్ చేస్తా.. జపాన్ చేస్తా.. 

 

రాజమౌళి బాహుబలిలో మాహిష్మతి కోటలా అమరావతిని కడుత అని అన్నారు కదా.. వాటిపై డైలాగ్ లు వేశారు.. సీఎం జగన్ సభలో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడిలాగా సింగపూర్‌, జపాన్‌, 'బాహుబలి'లాంటి మోసపూరిత సెట్లను మేం చూపించడం లేదు. మన ఆర్థిక పరిస్థితి, అవసరాలు, మనం ఏం చేయగలం? ఏ మేరకు చేయగలం? అని ఆరాటపడటం తప్పా? అని అడుగుతున్నా. సభలు, మండలలు మంచి చేసేవిగా ఉండాలి. మంచి చేసే నిర్ణయాలు ఆలస్యం కాకూడదు.. అని సింగల్ డైలాగ్ లో తేల్చేసారు. 

 

కాగా శాసనమండలితో ఎటువంటి ఉపయోగం లేదు అని.. మంచి చేయడం మానేసి మంచికి అడ్డు పడుతుంది అని.. అలాంటి ఈ శాసనమండలి ఉండటం అనవసరం అని అయన ఈరోజు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు శాసన మండలిలో ఒక్క నెగటివ్ ఓటు కూడా లేకుండా మొత్తం 133 పాజిటివ్ ఓట్లతో.. మూడు పార్టీల నేతల మద్దతుతో శాసనమండలిని రద్దు చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: