ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపుత్రుడు నారా లోకేష్ పై, చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ఎప్పుడు ప్రతిపక్ష మాటలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా చంద్రబాబు నాయుడు సుపుత్రుడుపై మండలికి సంబంధించి సెటైర్లు వేశాడు.

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. ''సిఎం జగన్ గారు విలువలకు కట్టుబడిన మొండి మనిషి కాబట్టి సరిపోయింది. గేట్లు తెరిచుంటే ఈ పాటికి అంతా జంప్ అయ్యేవారే. మంత్రి పదవి ఆఫర్ చేస్తే ఆఖరికి మాలోకాన్ని కూడా పంపించి కేసుల నుంచి తప్పించుకోవాలని చూసేవాడు చంద్రబాబు.'' అంటూ విజయసాయి రెడ్డి ట్విట్ చేశాడు.'' అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశాడు విజయసాయి రెడ్డి. 

 

అయితే నిజానికి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోజు నీ పార్టీ వారు ఎవరైనా సరే రాజీనామా చేశాకనే పార్టీలోకి ఆహ్వానిస్తా అని అన్నారు.. అలానే సీఎం జగన్ తన మాటకు కట్టుబడి.. ఎంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి రావాలని చుసిన.. రాజీనామా చేస్తేనే అని అనడం వల్ల అందరూ ఇప్పటికి టీడీపీలో ఉన్నారు.. లేకుంటే ఎప్పుడో వైసీపీకి వచ్చే వాళ్ళు అని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. 

 

కాగా ఇప్పుడు ఇదే విషయంపై విజయసాయి రెడ్డి ట్విట్ చెయ్యడం.. అలాగే విజయసాయి రెడ్డి చంద్రబాబు బుద్ధిని ఒక్క ట్విట్ తో కళ్ళకు కట్టినట్టు చూపించడం నెటిజన్లకు నచ్చింది. దీంతో నెటిజన్లు కూడా ఈ ట్విట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. దీంతో ఈ ట్విట్ ఒకరకంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: