ఇప్పటికే...తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఊహించని షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనే తేడా లేకుండా అధికార వైసీపీలోకి నేతలు జంపవుతున్నారు. అయితే, ఈ ఒరవడిలోనే పార్టీకి అండగా ఉండే నందమూరి ఫ్యాన్స్​ వైసీపీలో చేరిపోతున్నారు. కర్నూలులో సోమవారం వందలాది మంది తారక్ ఫ్యాన్స్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి మరీ వైసీపీలో చేరారు. వీరిలో తారక్ ఫ్యాన్స్ తో పాటు తారక్ సోదరుడు కల్యాణ్ రాం ఫ్యాన్స్ కూడా ఉండటంతో....అధికార తెలుగుదేశం పార్టీ నేతలు షాక్​ తింటున్నారు.

 

తమ చేరికను తారక్ ఫ్యాన్స్ తో పాటు తారక్ సోదరుడు కల్యాణ్ రాం ఫ్యాన్స్ ​ ఓ రేంజ్​లో నిర్వహించడం గమనార్హం. ఎన్టీఆర్–ఎన్కేఆర్ టైగర్ టీం జిల్లా అధ్యక్షుడు బోయపాటి మధు ఆధ్వర్యంలో కర్నూలు నగర శివారు నుంచి నగరంలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్ దాకా భారీ ర్యాలీగా తరలివచ్చారు. దాదాపు 1500 మంది తారక్ కల్యాణ్ రాం అభిమానులకు కర్నూలు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత బోయపాటి మధుతో పాటు తరలివచ్చిన తారక్ కల్యాణ్ రాం ప్యాన్స్ కు మోహన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పారు.


కాగా,  వైసీపీ తీర్థం పుచ్చుకున్నది కర్నూలు జిల్లాకు చెందిన  తారక్ ఫ్యాన్స్ మాత్రమే అయినప్పటికీ , ఈ  ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. సీమలో వలే మిగిలిన జిల్లాల్లోనూ తారక్ ఫ్యాన్స్ అంతా వైసీపీలోకి క్యూ కట్టేందుకు ఆసక్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే, తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ అని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే పార్టీలో నేతలు క్రియాశీలంగా లేని పరిస్థితి ఉండగా...అండగా నిలిచిన అభిమానులు సైతం అధికార పార్టీ వైపు మొగ్గుచూపుతుండటం....ఆ పార్టీకి పెద్ద దెబ్బే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: