అయ్యో అయ్యో అయ్యయో.. వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఎంత మాట అన్నాడు బాబు.. మిమ్మల్ని దారుణంగా అవమానించాడు కదా బాబు.. అయ్యో.. అని అంటున్నారు నెటిజన్లు. ఇంకా వివరాల్లోకి వెళ్తే.. విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. పార్లమెంటు మండలి రద్దు బిల్లు తిరస్కరిస్తుంది అని కలలు కంటున్నారు అంటూ చంద్రబాబుకు చురకలు అందించాడు విజయసాయి రెడ్డి.                

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. ''కాలభైరవ యాగాల తర్వాత క్షుధ్ర పూజలే మిగిలాయి. అవి కూడా కానిచ్చి ఫలితం కోసం నిరీక్షించండి. కౌన్సిల్ రద్దు బిల్లును పార్లమెంటు తిరస్కరిస్తుందని కలలు కనొచ్చు. రాజధాని భూముల కోసం మీరు ప్రదర్శిస్తున్న నాటకాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఇంకోసారి వాతలు తప్పవు.'' అని ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి. 

 

దీంతో ఈ ట్విట్ చుసిన నెటిజన్లు వాళ్ళు కలలు కనాల్సిందేలేండి.. అంతకు మించి ఏమి చెయ్యలేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. కాగా ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వాళ్ళు అన్ని పూజలు చేస్తారు .. అవి అన్ని అయ్యాయి.. వాళ్లకు వాతలు పెట్టిన పెద్ద తేడా ఏమి ఉండదు అంటూ నెటిజన్లు కూడా చంద్రబాబుపై పచ్చ పార్టీపై మండిపడుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: