కడుపుతో ఉన్నవారిలో వందకి 80శాతం మంది మగబిడ్డ కావాలని కోరుకుంటారు. దీనికోసం రక రకాల పూజలు పునస్కారాలు అంటూ తెగ గుడులు, గోపురాలు తిరిగేస్తుంటారు. ఇక దీనికోసం చేయని పూజ, నోచని నోమూ ఏమీ ఉండవనుకోండి. మరికొందరైతే ఏకంగా ఆంత్రాలు తాయిత్తులు కూడా కట్టించేసుకుంటారు.
కానీ, మగపిల్లాడే పుట్టాలంటే ఇలా చేస్తే సరిపోతుందని ఆయుర్వేదానికి సంబంధించిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేంటంటే తూర్పు లేదా ఉత్తరం దిక్కుగా ఉన్న రెండు మర్రిచెట్టు ఆకులను తీసుకొని అందులో ఖచ్చితంగా రెండు జీలకర్ర గింజలను వేసి నూరి, ఆ మిశ్రమాన్ని గర్భవతి అయిన మహిళ పుష్య నక్షత్ర సమయంలో పెరుగుతో కలిపి తినాలని పేర్కొన్నారు. ఇదొక్కటే కాదు మగ పిల్లాడు పుట్టాలంటే..మరో ఐదు ప్రక్రియలను కూడా వివరించారు.
గర్భవతి అయిన మహిళకు అధిక మోతాదులో బంగారం, వెండి, ఇత్తడి మిశ్రమాన్ని తినిపించాలన్నది అందులో ఒక ప్రక్రియ. ఈ మూడింటి మిశ్రమంతో ఓ బాలుని ప్రతిమ చేసి.. దానిని కరిగించి పెరుగు, పాల మిశ్రమంలో కలిపి అదే పుష్య నక్షత్ర సమయంలో తీసుకుంటే ఫలితం ఉంటుందని అంటున్నారు.
అయితే, ఈ చిట్కాలు మూఢ నమ్మకాలను మరింత పెంచేలా ఉన్నాయని పలువురు సామాజిక కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని ప్రముఖ సామాజిక కార్యకర్త వర్ష దేశ్పాండే అన్నారు. ఇలాంటి మూఢనమ్మకాలను వ్యాప్తి చేయడం చాలా ప్రమాదకరమని, రాజ్యాంగం మనకు ఇచ్చిన సమానత్వానికి ఇది విరుద్ధమని ఆమె గతంలో ఒకసారి స్పష్టంచేశారు. ఇక ఇదిలా ఉంటే ఇలాంటి నమ్మకాలను ఎప్పటికీ నమ్మకూడదు అని మరికొంత మంది వాదిస్తున్నారు.
అలాగే ఏ బిడ్డైనా సరే ఆరోగ్యంగా పుట్టడమే ముఖ్యమని. ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు కడుపులో ఉన్న బిడ్డ ఆడైనా మగైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా పుడితే చాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.