అమ్మ అన్న ప్రేమ‌లోని తియ్య‌ద‌నం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అమ్మ ప్రేమ‌ని మించింది ఈ లోకంలో మ‌రొక‌టిలేదు. అలాంటిది త‌ల్లే బిడ్డ‌ల్ని చంపుకునే  ప‌రిస్థితులు నెల‌కొన్నాయి నేటి స‌మాజంలో. ఇంత‌క‌న్నా నీచ‌మైన విష‌యం మ‌రొక‌టి ఉందా. వివాహేత‌ర సంబంధాలు ఎక్కువైన త‌రుణంలో మ‌నిష‌నేవాడు చ‌చ్చిపోతున్నాడు. ఏమూల కూడా మాన‌వ‌త్వం బ్ర‌తికి ఉండ‌డం లేదు. క‌న్న‌త‌ల్లి త‌ప్పుదారిలో న‌డుస్తూ దాని కోసం బిడ్డ‌ల‌ను సైతం చంపే ప‌రిస్థితులు వ‌చ్చాయి. ఇంత నీచ‌మైన ఘ‌ట‌న ఒక‌టి ఛండీగ‌ఢ‌లో చోటు చేసుకుంది.

 

రెండేళ్ళ ప‌సి పిల్లాడి నోట్లో గుడ్డ‌లు కుక్కి బెడ్ బాక్స్‌లో నొక్కి పెట్టి పెట్టి ఆ త‌ల్లి త‌న ప్రియుడితో క‌లిసి లేచిపోయింది. ఈ విష‌యం విన‌డానికే ఇంత నీచంగా ఉంటే... అది చూసిన ఆ భ‌ర్త ప‌రిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించండి.  ఈ ఘ‌ట‌న ఛండీఘ‌డ్‌లో చోటుచేసుకుంది. దీని పై పంజాబ్ పోలీసులు ఓ ప్ర‌క‌ట‌న ఇచ్చారు. 

 

పోలీసులు చెప్పిన వివ‌రాల ప్ర‌కారం రాత్రి 8.50 గంటల స‌మ‌యంలో చండీగఢ్ లోని బురెయిల్ గ్రామంలో ఓ మహిళ త‌న క‌న్న‌కొడుకు నోట్లో గుడ్డలు కుక్కినట్లు పోలీసులకు స‌మాచారం అందింది. దీంతో పోలీసులు వారి వాహ‌నంలో హుటా హుటిన ఆ బాలుడిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కానీ అప్ప‌టికే ఆ బాలుడు మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసును న‌మోదు చేసుకుని ఆ హిళ‌ను ప‌ట్టుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. బాలుడిని పడకలో కుక్కి ప్రియుడితో తన భార్య లేచిపోయిందని బాలుడి తండ్రి దశరథ్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు.

 

ద‌శ‌ర‌ధ్ ఎల‌క్ట్రీషియ‌న్‌గా ప‌నిచేస్తున్న‌డు. ఆదివారం నాడు ప‌ని ముగించుకు వ‌చ్చిన భ‌ర్త. భార్య పిల్లాడు క‌నిపించ‌క‌పోయేస‌రికి త‌న పుట్టింటికి వెళ్ళి ఉంట‌ద‌ని భావించాడు. కానీ ఎందుకో అనుమానం వ‌చ్చి భార్య‌కు ఫోన్ చేయ‌గా కొడుకు బెడ్ కంపార్ట్‌మెంట్‌లో ఉన్నాడ‌ని చెప్పింది. భ‌ర్త బెడ్ బాక్స్ తెరిచి చూడ‌గా పిల్లాడు క‌నిపించాడు. దాంతో వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: