కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ లో ఏ ఏ రంగాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. గత రెండు మూడు దశాబ్దాలుగా దేశం, దేశ భద్రత అనే అనే పదాలకు బాగా  ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది. బడ్జెట్లో ఎక్కువ భాగం రక్షణ శాఖకు కేటాయిస్తున్నారు. సైన్యం తదితర విభాగాలకు ఖర్చు కూడా అధికంగా ఉంటోంది. సరిహద్దు రక్షణ, భారత సైనికులు దళాల అవసరాల నిమిత్తం అవసరమైతే బడ్జెట్ ను మరింత పెంచే దిశగా కేంద్రం ఆలోచన చేస్తోంది.


 అలాగే దేశం కోసం అలుపెరుగకుండా సేవలందిస్తున్న సైన్యానికి వారి డిమాండ్లపైనా సానుకూలంగా స్పందించబోతున్నారు. 2014 15 మధ్యంతర బడ్జెట్లో 500 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు 35 వేల కోట్లు దాటింది. ప్రస్తుత బడ్జెటు లో దేశ భద్రతకు 3,05,296 కోట్లకు పైగా బడ్జెట్ లో కేటాయింపులు జరిగే అవకాశం కనిపిస్తోంది.  అలాగే ప్రమాదకర పరిస్థితులు విధులు నిర్వహించే వారికి ప్రత్యేకంగా అలవెన్స్ లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. ఏ దేశానికైనా రక్షణ వ్యవస్థ అనేది అత్యంత కీలకమైన వ్యవహారం కాబట్టి ఏ రంగానికి కేటాయింపులు ఉన్నా లేకపోయినా బడ్జెట్ లు రక్షణ రంగానికి ఎప్పుడు పెద్ద పీటే వేయాలని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నా.. గత కొంతకాలంగా రక్షణ రంగానికి కొంత బడ్జెట్ తగ్గుతూ వస్తోంది. 


శత్రు దేశాలకు ధీటుగా నిలబడాలంటే భారత్ అత్యంత ఆధునిక ఆయుధాలు సమకూర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకంటే చిన్న దేశం పాకిస్తాన్ ఆ దేశ బడ్జెట్ లో అత్యధిక శాతం రక్షణ రంగానికి కేటాయిస్తోంది. మిగతా దేశాలకు ధీటుగా అత్యంత ఆధునిక యుద్ధ విమానాలు కలిగి ఉంది. కానీ భారత్లో మాత్రం ఇంకా కాలం చెల్లిన విమానాలతో నెట్టుకొస్తోంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో రక్షణ రంగానికి ప్రత్యేక కేటాయింపులు చేసే దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.


 త్రివిధ దళాలకు బడ్జెట్లో ఎక్కువగానే కేటాయింపులు చేయబోతున్నారట. అయితే  వాటిలో ఎక్కువ భాగం జీతాలు ఇతర చెల్లింపులకి సరిపోతుంది. దీంతో సొంతంగా ఆయుధాలు సమకూర్చుకునే ప్రక్రియ ఎప్పటికప్పుడు పెండింగ్ పడుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగానికి ఏ విధంగా ప్రాధాన్యం పెంచుతారు అనేది చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: