టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఎప్పుడు అధికార పార్టీపై పలు విమర్శలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలుసిందే. ఇక తాజాగా శాసన మండలికి వికేంద్రీకరణ బిల్లు వచ్చిన సమయంలో పలువురు టిడిపి ఎమ్మెల్సీ హాజరుకాకపోవడం... ఆ తర్వాత వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించేందుకు శాసనమండలి చైర్మన్ నిర్ణయించడంతో... శాసనమండలిని రద్దు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడం... ఇలాంటి వాటిపై స్పందించిన జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి అయిన నారా లోకేష్ ఘాటు విమర్శలు చేశారు. 

 

 

 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను సంతలో  గొర్రెలను కొనుకున్నట్లు కొనుగోలు చేసింది అంటూ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. సంతలో  గొర్రెలును కొన్నట్లు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే లను కొనుగోలు చేయటమే  గొర్రెల డాక్టర్ను కూడా కొనుగోలు చేశారు అంటూ... గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసి ఉన్న ఫోటోలు పోస్ట్ చేశారు నారా లోకేష్. ఇక  మామూలుగానే గన్నవరం వల్లభనేని వంశీ ఫైర్ బ్రాండ్ గా ఉంటారు... అలాంటివి లోకేష్ తన పై కామెంట్ చేసిన తర్వాత ఎలా ఊరుకుంటారు. వెంటనే లోకేష్ ట్వీట్ పై స్పందిస్తూ ఘాటుగానే బదులిచ్చారు వల్లభనేని వంశీ. 

 

 

 తన వద్ద గొర్రెలకే కాదు పిచ్చి కుక్కలు కూడా వైద్యం ఉంది అంటూ వల్లభనేని వంశీ లోకేష్ పోస్ట్ లను  ఉద్దేశిస్తూ సంచులన పోస్టు పెట్టారు. వెటర్నిటీ డాక్టర్ అయిన వల్లభనేని వంశీని  విమర్శిస్తూ నారా లోకేష్ పోస్ట్ పెట్టడం తో... వెంటనే స్పందించిన వల్లభనేని వంశీ అదే రీతిలో ఘాటుగా సమాధానం ఇచ్చారు. దీంతో వీరిద్దరి పోస్టులతో సోషల్ మీడియా ఒక్కసారిగా వేడెక్కింది. వంశి అక్కడితో ఆగకుండా... వద్దంటే మంగళగిరి నుంచి పోటీ చేసి  చిత్తుగా ఓడిపోయారు... మండలి రద్దు కావడంతో లోకేష్ కు ఏం అర్థం కాక పిచ్చి పట్టినట్టు ఉంది అందుకే ఇలా మాట్లాడుతున్నారు అంటూ వల్లభనేని వంశీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: