మాజీ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో సమయం దొరికినప్పుడల్లా వైయస్ జగన్ ని టార్గెట్ చేసుకుని రకరకాల కామెంట్లు సెటైర్లు వేస్తూ ఉంటారు. అప్పట్లో ఈ విధంగా మాట్లాడారని ఇప్పుడు ఈ విధంగా మాట్లాడారు అంటూ ఇటీవల నాడు-నేడు అనే జగన్ ప్రకటించిన ప్రభుత్వ పథకాన్ని సోషల్ మీడియాలో తీసుకువచ్చి తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో జగన్ ప్రభుత్వం పై మండిపడుతున్నారు. ఇప్పటికే అనేక విషయాల గురించి స్పందించిన నారా లోకేష్ గన్నవరం ఎమ్మెల్యే ని టార్గెట్ గా చేసుకుని పెట్టిన పోస్ట్ లోకేష్ కి మరియు వంశీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.

 

డైరెక్ట్ పాయింట్ లోకి వెళ్తే ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీను సంతలో గొర్రెలను కొన్నట్లు కొన్నారని ఆరోపించారు. గొర్రెలతో పాటు గొర్రెల డాక్టర్ ను కొన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ పోస్టుతో పాటు జగన్ , వంశీ ల పోటోను జతచేశారట. దానిపై వంశీ రియాక్ట్ అయ్యారు. వద్దంటే వినకుండా లోకేష్ మంగళగిరిలో పోటీచేసి ఓడిపోయారని ఎద్దేవ చేశారు. తాను గొర్రెలకు కాదు..పిచ్చి కుక్కలకు కూడా వైద్యం చేస్తానని ఎదురు పోస్టింగ్ పెట్టడంతోపాటు అనేక సెటైర్లు వేస్తూ లోకేష్ నీ ఆటాడుకున్నారు వల్లభనేని వంశీ.

 

గతంలో పార్టీ నుండి సస్పెండ్ అయిన సందర్భంలో వల్లభనేని వంశీ నారా లోకేష్ ని టార్గెట్ గా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద పప్పు అని తెలుగుదేశం పార్టీ అతని వల్లే మునిగి పోతుంది అని పార్టీ ఈ స్థితికి రావడానికి కారణం లోకేష్ మరియు చంద్రబాబు అని దేనికీ పనికి రాని నారా లోకేష్ ని చంద్రబాబు రాజకీయాల్లోకి తీసుకు వచ్చాడని తీవ్ర స్థాయిలో అప్పట్లో విమర్శలు చేయడం జరిగింది. మీడియా ముందు ఏం మాట్లాడతాడో అర్థంకాని పరిస్థితి నారా లోకేష్ రాజకీయ పరిస్థితి అని పోటీచేసే నియోజకవర్గం మంగళగిరి పేరు పలకడం రాదని అదేవిధంగా జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియని నారా లోకేష్ నీ చంద్రబాబు మంత్రిని చేశాడని తీవ్రస్థాయిలో అప్పట్లో కామెంట్ చేసిన వల్లభనేని తాజాగా మళ్లీ ఇటీవల టార్గెట్ చేయడంతో ఈ విషయం ఇప్పుడూ ఏపీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: