విజయసాయి రెడ్డి... ఎప్పుడు ఏదో ఒక విషయంపై ప్రతిపక్షంపై సోషల్ మీడియాలో ఫైర్ అవుతూ ఉంటారు.. వైసీపీ ప్రధాన కార్యదర్శి అయినా విజయసాయి రెడ్డి.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ప్రతిపక్షాలు చేసే చిల్లర ఆరోపణలపై ఘాటుగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.  

 

ఈ నేపథ్యంలోనే మండలి రద్దుపై చంద్రబాబు వేసే రంకెలపై, మళ్ళి చంద్రబాబు గెలుస్తా అని అహంకారపు మెట్లపై విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సెటైర్లు వేశాడు. ఈ మేరకు ట్విట్టేర్ వేధికగా సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తే.. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి, రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే కౌన్సిల్ రద్దును సమర్థిస్తామని రంకెలు వేసే బదులు మీరంతా రిజైన్ చేసి గెలవండి.రిఫరెండంగా భావిస్తాం.నోరు తెరిస్తే దమ్ము, సత్తాల గురించి మాట్లాడటం  తప్ప వాటిని ప్రదర్శించే సాహసం మాత్రం చేయడు.ఇంకా 1990ల్లోనే ఉంటే ఎలా బాబూ!'' అంటూ బాబుపై సెటైర్లు వేశాడు విజయసాయి రెడ్డి. 

 

అయితే ఈ ట్విట్లపై స్పందించిన నెటిజన్లు.. చంద్రబాబుపై తీవ్రంగా మండిపడుతూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ''దమ్ములు ఇసరడమే తప్పా ఎప్పుడైనా చూపించాడా సార్. జీవితం అంత వెన్నుపోటు రాజకీయాలు, పక్కోడి మీద ఆధారపడినవే తప్పా, సొంతంగా ఎప్పుడైనా ఏమైనా చేశాడా.'' అంటూ ట్విట్లు చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: