అక్రమ సంబంధం ప్రస్తుతం ఎన్నో హత్యలకు దారితీస్తోంది... అక్రమ సంబంధం ఎన్నో కాపురాల్లో చిచ్చు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసింది. అక్రమ సంబంధం సాఫీగా సాగిపోతున్న సంసారంలో మంట పట్టిస్తోంది. రోజురోజుకు అక్రమ సంబంధం నెపంతో  హత్యలు ఆత్మహత్యలు చేయడం ఎక్కువైపోతున్నాయి. భార్య భర్తల మధ్య ఉండాల్సిన అన్యోన్యతను మరచి వేరే వ్యక్తులు మోజులో పడి కట్టుకున్న  వారిని కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ప్రియుడి సాయంతో భర్తను హత్య చేయడం ఆ తర్వాత పోలీసులకు చిక్కి కటకటాల పాలు కావడం... ఇలాంటి ఘటనలు నేటి రోజుల్లో కోకొల్లలు. 

 

 

 తాజాగా ఇలాంటి ఘటన జరిగింది. ప్రియుడి మోజులో పడి భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడి  సాయంతో భర్తను పక్క ప్లాన్ తో హత్య చేసింది భార్య. వివరాల్లోకి వెళితే... పశ్చిమగోదావరి జిల్లా కలవచర్ల గ్రామానికి చెందిన చిల్లపల్లి అప్పారావుకు వేణు అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే భర్త అప్పారావుపై అత్యాచారం  దొంగతనం ఆరోపణలు రావడంతో భర్తతో కాపురం చేయడం ఇష్టం లేక... డి పోలవరం లోనే పుట్టింటికి వెళ్ళి ఉంటుంది. ఈ క్రమంలోనే అదే గ్రామంలో చికెన్ షాప్ నడిపే మురళి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త అక్రమ సంబంధం గా మారిపోయింది విషయం తెలుసుకున్న భర్త పలుమార్లు డీ పోలవరం కు చేరుకొని భార్యను హెచ్చరించారు. 

 

 

 

 దీంతో తన సుఖానికి అడ్డు వస్తున్న భర్తను ఎలాగైనా అడ్డు తప్పించాలని భావించిన భార్య వేణు... ప్రియుడు మురళి, తండ్రి గున్నయ్య, స్థానికుడు భానుతో కలిసి భర్త అప్పారావు చంపేందుకు కుట్ర పన్నింది. ఈ క్రమంలోనే ఈ నెల 18న పోలవరం వచ్చిన భర్త అప్పారావు బస్టాండ్లో నిద్రిస్తుండగా అతని తలపై పెద్ద బండరాయితో మోది హత్య చేసింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్య పై నిఘా పెట్టగా అక్రమ సంబంధం బయటపడింది. దీంతో తమదైన స్టైల్లో భార్యని విచారించడంతో నేరం  అంగీకరించింది. భార్య వేణు తో పాటు ఈ హత్యకు సహకరించిన వారిని కూడా కటకటాల వెనుకకు తోసారూ పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: