అసలు ఈ సమాజం ఎక్కడికి పోతుంది. రోజు రోజుకి దిగజారుతున్న భారతీయ సంస్కృతి సంప్రాయాలు అని కొన్ని కొన్ని సంఘటనలు చూస్తున్నా.. వింటున్నా అనిపిస్తుంది. అలా అనిపించడానికి కారణాలు లేకపోలేదు. ఒకప్పుడు ఆడపిల్లలు బయటకు రావాలంటేనే భయపడేవారు. ఇంట్లోంచి ఆడవారు పెద్దగా బయటకు వచ్చేవారు కాదు. ఏదో వంటింటి వరకే వాళ్ళ జీవితం పరిమితమయ్యేది. నేటి తరం అలా కాకుండా అన్నిట్లో ముందుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఎవ్వరైనా అభివృద్ధి చెందాలనే కోరుకుంటారు. కానీ కొన్ని దారుణాలు వింటున్నప్పుడే ఆశ్చర్యం కలుగుతుంది.
ఒకపక్క మగాడు మృగాడిగా మారి ఆడవాళ్ళను చిదిమేస్తున్న ఆందోళనలు నడుస్తున్నపరిస్థితుల్లో... మరోవైపు ఆడవారు కూడా ఈ విషయంలో కూడా మేము మీతో సమానమే అంటున్నారు. అదేంటి ఇలా వింతగా ఉంది అనుకుంటున్నారా? ఇది నిజం ఉత్తర్ ప్రదేశ్లోని ఉన్నావ్ ప్రాంతానికి చెందిన శైలేష్ డిగ్రీ చదువుతున్నాడు. కాలేజీ దగ్గరలో అతను ఓగదిలో నివాసముంటున్నాడు. అతడు ఇంటి యజమానితో చాలా చనువుగా ఉండేవాడు. వారికి అవసరమైన పనులు చేస్తూ వారి ఇంట్లో మనిషాగా కలిసిపోయాడు. దీంతో ఆ ఇంటి యజమానురాలు అతడి పై కన్నేసింది. శైలేష్ని ఏదొక పని పేరుతో తరుచూ ఇంటికి పిలిచి తన ప్రవర్తనతో రెచ్చగొట్టేది.
విషయం భర్తవరకు వెళితే ఇబ్బంది పడాల్సి వస్తుందని ఊహించి శైలేష్ సైలెంట్గా ఉండిపోయాడు.
ఆమె ఎలాగైనా శైలేష్ను దారిలోకి తెచ్చుకోవాలని తాను ఇకపై ఇబ్బంది పెట్టనని, స్నేహితుల్లా ఉందామని అతడికి కల్లబొల్లి కబుర్లు చెప్పింది. ఎవరూ లేని సమయం చూసి శైలేష్ను ఇంటికి పిలిచింది. అతడికి తినడానికి స్వీట్లు, ఐస్క్రీమ్ ఇచ్చింది. వాటిని తిన్న అతడు తనకు తెలియకుండానే మత్తులోకి జారుకోవడంతో బెడ్రూమ్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడింది.
కాసేపటికి అతనికి మెలకువ వచ్చింది శైలేష్ ఆ దారుణాన్ని నిలదీయగా ఆమె ప్లేటు ఫిరాయించింది. ‘ ఈ విషయం ఎవరికైనా చెబితే నువ్వే నన్ను రేప్ చేశావని కేసు పెడతా. బుద్ధిగా నా చెల్లిని పెళ్లి చేసుకుని ఆమెతో పాటు నన్ను కూడా సుఖపెట్టు. లేదంటే నీ జీవితాన్ని జైలుపాలు చేస్తానంటూ బెదిరించింది. దీంతో శైలేష్ ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. తదుపరి విషయాలు పోలీసులు విచారిస్తున్నారు.