టెక్నాలజీ పరంగా ప్రపంచం చాల అభివృద్ధి చెందింది. టెక్నాలజీ పెరగడంతోపాటు కొత్త సమస్యలను తీసుకొస్తుంది. ఇప్పుడు ఉన్న సమాజంలో సైబర్ నేరస్థులు ఎక్కువగా అయ్యారు. వారు ఎక్కడో ఉండి డబ్బును కాజేస్తుంటే మరి కొందరు ఇంట్లో చొరపడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలు దొంగతనం చేసుకొని వెళ్లకుండా ఎదిరించిన వారిని చంపేస్తున్నారు. అలాంటి సంఘటనే దుబాయిలో చోటు చేసుకుంది.

 

దొంగతనానికి వెళ్లి పనిమనిషిని హత్య చేసిన ఓ వ్యక్తికి దుబాయి కోర్టు 25 ఏళ్ల జైలుశిక్ష విధించింది. దుబాయిలోని అల్ బార్షాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్‌కు చెందిన నిందితుడు కొంతకాలం క్రితం పని నిమిత్తం దుబాయికి వెళ్లారు. అతను పనిచేసిన విల్లాలోనే కన్నం వేయాలని ప్లాన్ వేశాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటికి కన్నం వేయాలనికున్నాడు. ఇంటి బయట ఫెన్సింగ్‌‌ను తొలగించి విల్లాలోకి దూరాడు. ఇంతకు ముందు అక్కడే పనిచేసిన వాడు కావడంతో.. నిందితుడిని చూసిన పనిమనిషి వెంటనే కనిపెట్టేసింది.

 

ఇదే సమయంలో నిందితుడు పనిమనిషిని గట్టిగా డ్రిల్లర్‌తో తలపై కొట్టాడు. ఆమె అరవకుండా నోట్లో గుడ్డ కుక్కాడు. అయితే ఈ ఘటనలో పనిమనిషి ప్రాణాలు కోల్పోయింది. ఆ సమయంలో ఇంట్లో పనిమనిషి తప్ప మరెవరూ లేనట్టు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో తాను తన భార్యతో కలిసి ఓ హోటల్‌లో ఉన్నట్టు యజమాని పోలీసులకు వివరించాడు. ఇదిలా ఉండగా.. తాను పనిమనిషిని ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని నిందితుడు పోలీసులకు చెప్పాడు. అరవకూడదనే కొట్టానని.. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదని అన్నాడు. నిందితుడిపై దొంగతనం, హత్య తదితర కేసులను పోలీసులు నమోదు చేశారు. కేసు కోర్టుకు వెళ్లగా జడ్జి 25 ఏళ్ల జైలుశిక్ష విధించి.. అనంతరం నిందితుడిని దేశం నుంచి బహిష్కరించాలంటూ తీర్పునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: