నిర్భయ, దిశా, సమతా ఇలా ఎందరో మహిళలు అన్యాయానికి గురయ్యారు.ఇంకా గురి అవుతూనే వున్నారు. ఈ క్రూర మృగాలకు మరణ శిక్ష విధించినా, ఇటువంటి అన్యాయాలు జరగకుండా ఎన్ని కఠిన మైన చట్టాలు చేసినా ఇంకా కొన్ని మృగాలలో మార్పు కనపడడం లేదు. అసలు ఈ అకృత్యాలు జారకుండా ఎన్ని చేయాలో, ఎంత కఠిన మైన చట్టాలు తేవాలో అన్నీ  తెచ్చినా ఈ మృగాలు మారడం లేదు సరికదా, మరింత రెచ్చిపోతున్నారు. తమిళనాడులో మరొక అబల ఈ కామ కత్తికి బలైపోయింది. వివరాల్లోకి వెళితే....

 

     తమిళనాడులోని నాగ పట్టణంలో  నివాసం ఉంటున్న నిత్యానందం మరొక నిత్యానంద అవతారమెత్తాడు. ఏకంగా తన కన్నకొడుకు ప్రేమించిన అమ్మాయిపైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పేరుకు ఊరిలో పెద్దమనిషిగా చెలామణి అవుతున్న సదరు నిత్యానంద గారు,, తన కన్న కొడుకు ప్రేమించిన అమ్మాయిని వివాహ విషయం మాట్లాడుదామని ఇంటికి పిలిచి ఆ అమ్మాయిని గృహ నిర్బంధం చేశాడు. నా కొడుకు నిన్ను చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటూ, ఈ వివాహం జరగకూడదంటే నువ్వు నా సొంతం అవ్వాలంటూ ఆ అమ్మాయిని అతి కిరాతకంగా ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రెండు రోజుల పాటు పలు మార్లు ఆ అమ్మాయిపై అఘాయిత్యం చేయడమే కాకుండా ఆ అమ్మాయిని చిత్ర హింసలకు గురి చేశాడు.

 

      ఆ కామాంధుడి బారి నుంచి ఎట్టకేలకు తప్పించుకున్న బాధితురాలు ఫ్రెండ్ ద్వారా  పోలీస్‌‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న వేదారణ్యం పోలీసులు నిందితుడిని గురువారం అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు..మనిషి మృగం ఒకటే అంటే మృగం సైతం ఛీ అనేలా ఉన్నారీ క్రూర మృగాలు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: