ప్రస్తుత సమాజంలో బంధాలకు బాంధవ్యాలకు గౌరవం లేకుండా పోతోంది. కుటుంబాలలో తరచూ గొడవలు సహజం. వాటికీ కూడా ఇపుడున్న యువతి యువకులకు ఓపిక.. ఆలోచించే విధానం లేకుండా పోతోంది. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఒంటి పై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్య కు పాల్పడిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ కి చెందిన కమలేష్ అనే వ్యక్తి కతోడియ బైక్ పై జన సంచారం లేని ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ ఎవ్వరు నిర్దారించుకున్న అనంతరం ఒంటి పై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని సజీవ దహనమయ్యాడు.
అయితే.. మంటల్లో కాలి పోతున్న కమలేష్ ను అటుగా వెళ్తున్న వ్యక్తులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికి కమలేష్ మంటలతో గగ్గోలు పెడుతున్నాడు. అయితే అప్పటికి మంటల్లో అతని శరీరం పూర్తిగా కాలిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ కలహాల తోనే కమలేష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమాన పడుతున్నారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం కమలేష్ బాడీని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. పోలీసులు కమలేష్ కుటుంబ గొడవల కారణం గానే ఇలాంటి పని చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఇంకా కమలేష్ కి ఎవరితో నైనా గొడవలు ఉన్నాయా..? లేక కుటుంబ కలహాలతో చనిపోయాడా..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే.. అతనికి చెందిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కాగా., జన సంచారం తక్కువగా ఉన్న ప్రాంతం కావడం.. పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించు కోవడంతో స్థానికులు కూడా అతనిని కాపాడే ప్రయత్నం చేయలేక పోయినట్లు తెలుస్తోంది. వారికీ మంటలు అంటుకునే అవకాశం ఉండడంతో నిస్సహాయంగా చూస్తుండి పోయారు. విషయం తెలిసిన వెంటనే ఆదిలాబాద్ రూరల్ సీఐ పురుషోత్తం చారి సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.