ఒక మనిషి పగ పడితే ఎంత క్రూరంగా మారతారో ఈ సంఘటన చదివితే మీకు తెలుస్తుంది.  గతంలో జరిగిన ఏదో ఒక గొడవలో ఒక వ్యక్తి చేసుకున్నానని ఆ వ్యక్తి పై మరో వ్యక్తి పాగా పెంచుకున్నాడు. ఆ పగల నేపధ్యంలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక సంవత్సరం తర్వాత అతన్ని వెతుక్కుంటూ 1500 కిలోమీటర్లు వెళ్లి నడిరోడ్డు పై కత్తితో దాడి చేశాడు. ఈ దారుణ ఘటన ముంబై లోని చెంబుర్ ప్రాంతంలో జరిగింది.

 

చెంబూర్ లో ఓ గార్డెన్ వద్ద టి, జ్యూస్ పాయింట్ నిర్వహిస్తున్న జ్యోతి రామ్ పై గుర్తు తెలియని వ్యక్తి కొబ్బరి బొండాల కత్తితో దాడి చేశాడు. అతను రెండు చేతులు అడ్డు పెట్టడంతో రెండు చేతులు విరిగిపోయాయి. అక్కడి స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

 

అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి తమిళనాడుకు చెందిన రమేష్.. నిందితుడిగా గుర్తించారు. నిందితుడు చెప్పిన విషయాలకు పోలీసులు షాక్ కి గురయ్యారు.

 

గత ఏడాది ఫిబ్రవరిలో జాగిన గొడవలో తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ వివాదంలో గాయాలపాలైన రమేష్ ఆస్పత్రి లో చేరారు. అనంతరం తమిళనాడులో తన స్వగ్రామానికి వెళ్లి పోయాడు. కానీ నడార్ మాత్రం ఈ ఘటనను మర్చిపోలేక పోయాడు. ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. ప్రతీకారం భావంతో రగిలిపోతున్న రమేష్.. నడార్ కోసం వెతికాడు. అతను ముంబై లో ఉన్నట్లు నిశ్చయించుకున్నాడు. ఓ రోజు ఉదయాన్నే అదును చూసి కొబ్బరి బొండాల కత్తితో దాడి చేశాడు. తర్వాత ఇంత దూరం వచ్చి కత్తి తో దాడి చేయడం పోలీసులకు షాక్ కు గురి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: