తెలుగు బుల్లితెర పై జబర్దస్త్ కామెడీ షో లో జడ్జీలుగా వ్యవహరించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు నాగబాబు, రోజా. కలసి షో లు చేస్తూ కలసి నవ్వుకుంటూ రాజకీయ రంగంలో ఉన్నా గానిటెలివిజన్ రంగంలో కెమెరా ముందుకు వచ్చేసరికి టీవీ చూసే ప్రేక్షకులకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసేవాళ్ళు. ఎక్కడా కూడా రాజకీయాలను తమ మధ్యలోకి రానివ్వకుండా టీవీ ప్రేక్షకులను బాగా అలరించే వాళ్లు.


అటువంటిది తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఇద్దరి మధ్య దూరం పెరిగి నాగబాబు లేదా రోజా అన్నట్లుగా మారిపోయింది. జనసేన పార్టీ తరుపున నాగబాబు అధికార పార్టీ వైసీపీ తరఫున ఎమ్మెల్యే రోజా మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఇదే తరుణంలో బుల్లితెరలో కూడా జబర్దస్త్ షో నుండి బయటికి వచ్చిన నాగబాబు జీ తెలుగులో ‘అదిరింది’ తో జబర్దస్త్ కి పోటీ ఇవ్వటానికి రెడీ అయ్యారు.

 
దీంతో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ అటు రాజకీయం గాను ఇటు బుల్లి తెర టెలివిజన్ పరం గాను చాలా గట్టిగా జరుగుతుంది. అంతే కాకుండా ఒకడుగు ముందుకు వేసి నాగబాబు అదిరింది షో తో.. జబర్దస్త్ షో పై పంచులు కౌంటర్లు వేయడంతో అటుపక్క కూడా జబర్దస్త్ షో నుండి ‘అదిరింది’షో పై కూడా కౌంటర్లు పడుతున్నాయి. దీంతో రెండు షో ల మధ్య నువ్వానేనా అన్నట్టుగా వాతావరణం నెలకొంది. 


అంతే కాకుండా రెండు షో ల మధ్య విమర్శించే వాతావరణం తారాస్థాయికి చేరుకోవడంతో రెండు పార్టీల మధ్య యుద్ధంగా మారిపోయింది. ఈ పరిణామాలతో సోషల్ మీడియాలో వైసీపీ వర్సెస్ జనసేన పార్టీ కార్యకర్తలు నువ్వానేనా అన్నట్టుగా ఒకరి ఫ్యాన్స్ మరొకరిపై మండిపడుతున్నారు. దీంతో టెలివిజన్ ప్రేక్షకులు ఇది ఎక్కడ సోది గోల రా బాబు అంటూ తిట్టుకుంటున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: