భరత్ కి పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద రూపంలో ముప్పు పొంచి ఉందని మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఉగ్రవాదం రూపంలో కాకుండా వేరే కొత్త సమస్యతో భారత్ కు ముప్పును వాటిల్లేలా చేస్తున్నాయి. ఇప్పుడు పొరుగుదేశం నుంచి కొత్త ప్రమాదం భారత్ వైపు తరుముకొస్తోంది. పాకిస్తాన్ సైన్యం ఇటు భారత ప్రజలను ఇబ్బంది పెడితే.. ఎపుడు వచ్చే ప్రమాదం భారత్ లో పండించే పంట పొలాలను దెబ్బతినే విధంగా ఉంది. అక్కడ కిరాతక ఉగ్రవాదులతో పాటు, ముడుతలు కూడా రాకాసివి ఉన్నాయి. 

 

పాకిస్థాన్ రైతులను ఇన్ని రోజులు రాకాసి మిడతలు హడలెత్తిచాయి. కానీ ఇప్పుడు రాకాసి విడుతలు సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించాయి. అక్కడి ప్రజలను ఇబ్బంది పెట్టిందే కాకుండా మన దేశ ప్రజలను కూడా ఇబ్బందికి గురిచేస్తున్నాయి. ప్రస్తుతం పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పంటపొలాలపై దాడి చేస్తూ చేతి కొచ్చిన పంటను కత్తిరించి, పంటను నాశనం చేస్తున్నాయి. పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ నుంచి ఇవి భారత్ భూభాగంలో ప్రవేశిస్తున్నట్టు గుర్తించారు. పాకిస్థాన్ లో ఇప్పటికే మిడతలపై ఎమర్జెన్సీ ప్రకటించారు. రాజస్థాన్ లోని 12 జిల్లాలపై ఈ పాక్ మిడతల ప్రభావం ఎక్కువగా ఉంది.

 

గత రెండున్నర దశాబ్దాల్లో ఇంతటి విపత్తు ఎప్పుడూ రాలేదని భారత్ రైతులు వాపోతున్నారు. ఈ మిడతల దండును తరిమేందుకు రైతులు పెద్ద శబ్దంతో పాటలు పెట్టడం, ఫైర్ ట్యాంకర్ల సాయంతో కెమికల్స్ స్ర్పే చేయడం వంటి నివారణ చర్యలు పాటిస్తున్నారు. అయితే పొరుగున ఉన్న పాకిస్థాన్ కూడా సరైన నివారణ చర్యలు చేపడితేనే వీటి ముప్పు తగ్గుతుందని భారత్ రైతులు అభిప్రాయపడుతున్నారు. అటు, పాకిస్థాన్ లో సైతం పరిస్థితి ఇదేవిధంగా ఉంది. మిడతలు పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపిస్తుండడంతో జాతీయ స్థాయిలో అత్యయిక స్థితి ప్రకటించాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: