లోకంలో ఎన్ని దారుణాలు జరుగుతున్న మనుషుల్లో మార్పు మాత్రం రావడం లేదు.. ముఖ్యంగా ప్రేమ వ్యవహరాలు, అక్రమ సంబంధాలు, సహజీవనం. ఇలాంటి వాటిని ఏదో గొప్పపనిలా భావించి నమ్మకంతో చేస్తున్నవారు నయవంచనకు గురవుతున్నారు. ఒకానొక సందర్భంలో ప్రమాదాలల్లో పడటమే కాదు, ప్రాణాలు కూడా పోతున్నాయి. ఎక్కువ మరణాలు రోడ్దుప్రమాదాల్లో జరుగుతున్నాయనుకుంటే, ఆ తర్వాత  నమ్మించి వంచించడంలో జరుగుతున్నాయి.

 

 

ఇలా అన్ని వయసుల వారు ఎన్ని సార్లు మోసపోయిన శరీర వాంచలను తీర్చుకోవడం కోసం మళ్లీ మళ్లీ తప్పటడుగులు వేస్తున్నారు. తప్పుడు దార్లో వెళ్లుతున్నారు. ఇక ఈ కాలంలో నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నా, చచ్చేదాక ప్రేమగా చూసుకుంటా అని అంటే మాత్రం నమ్మకండి. ఆరోజులు పోయాయి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు గుడ్డిగా నమ్మడం మొదలు పెట్టారో అప్పుడే మోసం చేయడం చాలా సులువు అవుతుందని గ్రహించండి. ఇక ఒక వ్యక్తి, మరో మహిళతో సహజీవనం చేస్తూ, అనుమానంతో చాలా దారుణానికి తెగించిన ఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు తెలుసుకుంటే..

 

 

మధ్యప్రదేశ్‌లో, నార్సింగ్‌పూర్‌లోని కెడియా గ్రామానికి చెందిన సూరజ్‌ ప్రభుదయాల్‌ యాదవ్‌, అతని ప్రేయసి ఇద్దరూ స్థానిక ప్రాంతంలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనుల్లో కూలీలుగా పని చేస్తూ.. మంకాపూర్‌లో ఓ గది తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఇక తాళి కట్టిన భార్యకే భద్రత లేని ఈ రోజుల్లో ఇలాంటి బందాలకు రక్షణ ఎలా ఉంటుంది. ఇవి రాలిపోయే ఆకులాంటి రిలేషన్స్.. అందుకే ఇలా చేసే పనుల్లో అనుమానాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఇప్పుడు ఇదే జరిగింది.

 

 

అదేమంటే సూరజ్‌ తన ప్రియురాలిపై అనుమానం పెంచుకుని, ఆమెతో రోజు గొడవ పెట్టుంటు మానసికంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. పట్టలేని ఆవేశంలో ఉన్న అతను, ఆగ్రహంతో ఊగిపోయి ప్రియురాలుపై పొగలు కక్కుతున్న వేడి వేడి నీళ్లు పోశాడు. ఆమె అరుపులు విన్న స్దానికులు, కాలిన గాయాలతో పడి ఉన్న మహిళను గమనించి ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: