జేసీ దివాకర్ రెడ్డి.. టీడీపీ మాజీ ఎంపీ ఇటీవల తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ పరిపాలనపై నిప్పులు చెరుగుతున్నారు. ఆయన ఏం మాట్లాడినా మీడియా హైలెట్ చేస్తుంటుంది.. మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఈ జేసీ వ్యాఖ్యలకు వైసీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది.

 

ఇక వైసీపీలో గట్టిగా మాట్లాడే మంత్రి కొడాలి నాని జేసీ దివాకర్ పై ఘాటు వ్యాఖ్యలతో కౌంటర్ ఇచ్చారు. తనదైన మార్కు డైలాగులతో వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని లూటీ చేసిన వ్యక్తి జేసీ దివాకర్‌ రెడ్డి అని మంత్రి కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు నాయుడు బూట్లు నాకి 500 ఎకరాల సున్నపు క్వారీలను తీసుకున్నారని ఆరోపించారు. పర్మిట్లు కట్టకుండా దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులు నడిపారని, ఓవర్‌ స్పీడ్‌తో ప్రజల ప్రాణాలు తీశారని చెప్పారు.

 

నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే జేసీ బస్సులను సీజ్‌ చేశారని, గనులను వెనక్కి తీసుకున్నారన్నారు. జేసీ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని మంత్రి హితవు పలికారు. చంద్రబాబు హయాంలో రూ. 5వేల కోట్ల ఇసుక మాఫియా జరిగిందని మంత్రి విమర్శించారు. అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ జరగాలని ముఖ్యమంత్రి జగన్‌ ప్రయత్నిస్తే మండలిలో బాబు అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. సీఎం జగన్‌ చేయగలిగిందే చెప్తున్నారని ప్రజలు నమ్ముతున్నారన్నారని అన్నారు.

 

చంద్రబాబు కుట్రల వల్ల సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిష్టను దెబ్బ తీయలేరన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడికి మతి భ్రమించిందని.. నాలుగేళ్లు బీజేపీతో కలిసి తిరిగి ప్యాకేజీ కోసం హోదాను గాలికి వదిలేశారని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు. మరి కొడాలి నాన్ని వార్నింగ్ పై జేసీ ఎలా స్పందిస్తారో.. ఎందుకంటే ఆయన నోరు కూడా అంత మంచిది కాదు కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: