నందమూరి బాలకృష్ణ ప్రాణస్నేహితుడు కదిరి బాబూరావు తెలుగుదేశం పార్టీకి సైలెంట్ షాక్ ఇవ్వనున్నారా? అంటే షాక్ గ్యారెంటీనే అంటూ దర్శి టీడీపీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతుంది. ఆయన టైమ్ చూసి టీడీపీకి దెబ్బ వేయడం ఖాయమని అంటున్నారు. బాలయ్యతో చిన్ననాటి నుంచి స్నేహం చేస్తున్న కదిరి...2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని, విజయం సాధించారు. ఆ ఐదేళ్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన కదిరికి...2019 ఎన్నికల్లో చంద్రబాబు షాక్ ఇచ్చారు.

 

కనిగిరి సీటు కాకుండా ఆయనకు దర్శి టికెట్ ఇచ్చారు. అప్పుడు దర్శి నుంచి పోటీ చేయాల్సిన సిద్ధా రాఘవరావు ఒంగోలు ఎంపీగా పోటీ చేయడంతో, కదిరిని దర్శి నుంచి బరిలో దింపారు. అయితే కదిరికి ఇష్టం లేకుండానే దర్శిలో పోటీ చేశారు. ఒకానొక దశలో ఆయన దర్శి నుంచి పోటీ చేయకుండా టీడీపీని వీడే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. అలా జరగలేదు కానీ అయిష్టంగానే బాబూరావు దర్శిలో దిగి ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుంచీ పార్టీ కార్యకలాపాల పట్ల అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

 

దీంతో ఆయన వైసీపీలోకి వెళ్లనున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ వార్తలని కదిరి ఖండిస్తూనే వచ్చారు. నందమూరి బాలయ్య, తాను.. చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులమని, ఆయన కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, చివరి వరకు ఆయనతోనే తన పయనం కొనసాగుతుందని టీడీపీని వీడేది లేదని భారీ డైలాగులు వేశారు. కానీ ఆయన డైలాగులు వేసిన మాదిరిగా ప్రస్తుతం పరిస్తితులు లేవని తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో టీడీపీకి పుంజుకునే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. పైగా దర్శిలో శిద్ధా పెత్తనం చేస్తున్నారు. దీంతో భవిష్యత్‌లో కూడా కదిరికి టికెట్ రావడం కష్టమయ్యేలా ఉంది. ఈ పరిస్తితులని గమనిస్తే...తాను సైలెంట్ గా వైసీపీలోకి వెళ్ళడం బెటర్ అని భావిస్తున్నారట. మరి చూడాలి బాలయ్య ఫ్రెండ్ టీడీపీకి ఎప్పుడు షాక్ ఇస్తారో?

మరింత సమాచారం తెలుసుకోండి: