సింహాలు, పులులు వంటి క్రూర‌మృగాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవ‌ల‌సిన ప‌ని లేదు. వాటి ఎదురు ప‌డితే ఇక అంతే సంగ‌తులు ఆం..ఫ‌ట్ అయిపోవ‌డ‌మే. అందులో ఎటువంటి సందేహం లేదు. అనుకోకుండా అది మ‌న క‌ళ్ళెదెరుప‌డిందో ఇక అంతే సంగ‌తులు బ‌తుకు జీవుడా అన‌డ‌మే ప‌ని. ఇక ఇదిలా ఉంటే...గుజ‌రాత్‌లో ఇలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి ఓ వ్య‌క్తికి ఎదురైంది. 

 

వివ‌రాల్లోకి వెళితే... గుజరాత్ లోని గిర్ అటవి ప్రాంతంలో జ‌రిగిన ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.  రాజ్యసభ ఎంపి పరిమల్ నాథ్వానీ త‌న ట్విట్టర్ ఖాతా ద్వారా ఆ వీడియోను పోస్ట్ చేసారు. ఈ వీడియోలో ఒక సింహం తన పిల్లలతో కలిసి ఒక రోడ్డులో వెళ్తూంది. అలా అవి వెళ్తూ ఉండగా ఆ తల్లిపిల్లలకు ఒక బండి ఎదురైంది. దానిపై ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తూ క‌నిపిస్తారు.

 

ఇంకేముంది వాటిని చూడ‌గానే గుండె గుబేలు మంది. దాంతో ఒకేసారి బండిని ఆపేశాడు. ఇక్క‌డ ఆశ్చ‌ర్యం  ఏమిటంటే...ఆ మూడు ఏమీ చెయ్య‌కుండా ప‌క్క‌కు వెళ్లిపోయాయి. దాంతో బ‌తుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. వెంట‌నే బండిని స్టార్ట్ చేసి ఆక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. 

 

ఇక ఇదంతా వీడియో తీసిన ఈ వీడియో ఈ వైర‌ల్ వీడియో ఒక గ్రామానికి ద‌గ్గ‌ర‌లో ఉన్న త‌ను వ్య‌వ‌సాయం కోసం పొలానికి వెళుతుండ‌గా మార్గ మ‌ధ్య‌లో సింహం త‌న పిల్లలు బైకర్ కు దారి ఇచ్చాయి. 36 సెకన్ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. అవి మ‌నుషులు ఎక్క‌డైతే తిరుగుతాయో వాటిని గ‌మ‌నించాయి దాంతో వాళ్ళ‌కు గౌర‌వం ఇచ్చి ప‌క్క‌కు త‌ప్పుకుంటున్నాయి అని అంద‌రూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో చూసి మ‌రికొంద‌రు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: