ప్రస్తుతం ప్రపంచాన్ని ఏదైనా వణికిస్తోంది అంటే అది కరోనా వైరస్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఆ వైరస్ ఏ ప్రస్తుతం ప్రజలను వణికిస్తోంది. మనుషులకు చుక్కలు చూపిస్తుంది. అత్యంత వేగంగా ఈ కరోనా వైరస్ వ్యాపిస్తుంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా దాదాపు 300కి పైగా ప్రజలు మృతి చెందారు. 

 

10 వేలమందికి పైగా ఈ కరోనా వైరస్ బారిన పడ్డారు.. దీంతో ప్రపంచ దేశాలు అన్ని వణికిపోతున్నాయి. అయితే.. అంత వణికిస్తున్న ఈ వైరస్ చైనాలో పుట్టి ప్రపంచ దేశాలు అన్నింటా వ్యాపిస్తుంది. దీంతో ప్రజలంతా వణికిపోతున్నారు. అయితే.. అలాంటి ఈ వైరస్ ప్రస్తుతం ని నియంత్రించడానికి.. వైద్యులు.. పరిశోధకలు కష్టపడుతున్నారు. 

 

అసలు ఈ వైరస్ ని ఎలా ఆపాలి అని వారు కష్టపడుతుంటే.. మొన్నటికి మొన్న ఓ హిందూ స్వామి.. ఆవు పేద.. ఆవు మూత్రం శరీరానికి పట్టించుకుంటే రాదు అని ప్రచారం చేశాడు.. ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఆపడానికి 21 రోజులు ఉపవాసం చెయ్యాలి అని.. ఆలా చేస్తే కరోనా వైరస్ మనిషి దగ్గరకు కూడా రాదు పోస్టర్లు వేసి ప్రచారం చేస్తున్నారు. 

 

అయితే ఆ పోస్టర్ లో ఇలా ఉంది.. కరోనా వైరస్ తెగులు ఆగిపోవుటకు 21 రోజులు ఉపవాస ప్రార్ధనలు చెయ్యాలి అని అది 3వ తేదీ నుండి 23వరుకు హైదరాబాద్ లో జరుగుతుంది అని.. ఈ ఉపవాస ప్రార్ధనను యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ నిర్వహిస్తున్నట్టు ఆ పోస్టరో ఉంది. దీంతో ఏంటి ఈ బాధ.. ఒకరు గోమూత్రం అంటారు.. మరొకరు ఉపవాస ప్రార్ధన అంటారు.. అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అయితే కరోనా వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పాలి కానీ ఇలా చెప్పడం ఏంటి అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: