ఈ మధ్యకాలంలో క్షణాకావేశాలు ఎక్కువ అయిపోతున్నాయి. క్షణాల్లో ప్రాణాలను తీసేస్తున్నారు. తీరా కారణం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అలా ఉంటుంది కారణం. అదేం అంటే.. వారికీ కావాల్సింది ఇవ్వలేదు అని చంపేశారట. ఎవరో బయట దొంగలు చంపారు అంటే ఏమో అనుకోవచ్చు.. కన్నకొడుకు.. కన్నతల్లిని, తండ్రిని, తమ్ముడిని చంపాడు అంటే ఏం అనుకోవాలి. 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తల్లి డబ్బు ఇచ్ఛందుకు నిరాకరించింది అని.. కన్నతల్లిని దారుణంగా హత్యా చేశాడు ఆ కసాయి కొడుకు. కేవలం 1500 రూపాయిల కోసం ముగ్గురిని హత్యా చేశాడు ఆ బాలుడు.. ఆ బాలుడికి సరిగా 18 ఏళ్ళు కూడా వయసు ఉండదు.. తల్లి డబ్బు ఇవ్వను అందని చున్నీతో ఆమె గొంతు నులిమి చంపేశాడు. 

 

అనంతరం ఆమె మరణించిందో లేదో అని తండ్రి రూమ్ నుండి లైసెన్స్ గన్ తెచ్చి తల్లి శరీరంలో రెండు బులెట్లు.. నాన్న శరీరంలోకి రెండు బులెట్లు.. పక్క రూమ్ లో ఆడుకుంటున్న తమ్ముడు గుండెలో రెండు బులెట్లు దించి ఇంటికి తాళం వేసి పారిపోయాడు ఆ బాలుడు. అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా అప్పటికే ముగ్గురు మృతి చెందారు. 

 

అయితే.. సంఘటన స్థలంలో ఆ ముగ్గురిని చంపినా కిరాతకుడు లెటర్ రాసి ఉంచాడు.. అతను చంపడానికి కారణం ఏంటో ఆ లెటర్ లోనే రాసి మరణించాడు. అయితే ఈ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. దీంతో ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

కాగా ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో మరి ఎక్కువ అయిపోయాయి. పిల్లలే ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్నారు.. అసలు 15 వందల రూపాయిల కోసం మర్డర్ అంటే మాములు విషయం కాదు.. ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ? పిల్లల తప్ప? పెద్దల తప్ప?

మరింత సమాచారం తెలుసుకోండి: