ఈ రోజుల్లో చాలా మంది మగవారు కొన్ని కొత్త కొత్త యాంగిల్స్ లో సెక్స్ చేయాలని తమ స్వాములను కోరుతూ ఉంటారు. కానీ అందుకు కొంత మంది నిరాకరిస్తూ ఉంటారు. కొందరు ఇంట్రస్ట్ చూపితే మరికొందరు పెద్దగా దాని పై ఆశక్తిని చూపరు. మరి ఇలాంటి సమయాల్లోనే మగవారికి చాలా మందికి కోపం వస్తుంది. కొందరు ఆ కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎలా స్పందిస్తారు అన్నది కొన్నిసార్లు కీలకంగా ఉంటుంది.
ఇటీవలె కొత్తగా పెళ్ళైన ఓ జంట హనీమూన్ కోసం డార్జిలింగ్కి వెళ్ళారు. భర్త భార్యతో తనతోపాటు బాత్రూంలో శృంగారంలో పాల్గొనాలని కోరాడు. అందుకు ఆమెకు నచ్చలేదు దాంతో ఆమె దానికి నిరాకరించింది. దీంతో భర్తకు ఆవేశం కట్టలు తెంచుకుంది. కోసం తాళలేక ఒక్కసారిగా మృగంలా మారాడు ఆమె పై విరుచుపడి చితకబాదాడు. దీంతో ఆ దెబ్బలను తట్టుకోలేక భార్య పోలీసులను ఆశ్రయించింది. అసలేం జరిగిందంటే... గుజరాత్ లోని భావనగర్కు చెందిన 21 సంవత్సరాల యువతికి గత నెలలోనే పెళ్లయింది.
అయితే పెళ్లి అయిన కొత్తలోనే అతడి ప్రవర్తన కాస్త విచిత్రంగా అనిపించింది. అయినా పెద్దగా పట్టించుకోలేదు. ఇక తాజాగా దంపతులు ఇద్దరు హనీమూన్ కోసం డార్జిలింగ్ వెళ్లారు. అక్కడ తనకు బాత్రూమ్ లో సెక్స్ కావాలంటూ బలవంతం చేయగా.. అందుకు ఆమె వద్దని నిరాకరించింది. తన కోరికను కాదన్నదనే కోపంతో నిందితుడు ఆమెను చితకబాదాడు. దీంతో బాధిత యువతి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తన భర్త శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు నిందితుడి పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇక రక రకాల మనుషులు ఉన్న ఈ రోజుల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరు ఎలాంటి సమయాల్లో ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదు. పెళ్ళి చేసే ముందు పెద్దవారు అన్నీ కనుక్కుని వారి గుణగుణాల గురించి వాకబ్ చేసి పెళ్ళిళ్ళు చేయాలి. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుని ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి.