ప్రస్తుత ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తుంది. ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఇప్పుడీ వైరస్.. కాగా., ఈ వైరస్ ఈ వైరస్ చైనాలో జన్మించింది. ఇప్పటికే చైనాలో ఈ వైరస్ బారిన పడినవారు వేళల్లో ఉన్నారు. అలాగే చనిపోయిన వారు కూడా చాలానే ఉన్నారు. చైనాలో ఇంకా అనుమానిత కేసులు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ సముద్రంలో ప్రయాణిస్తున్న వారిని కూడా వదలటం లేదు. 

 

తాజాగా జపాన్‌ కు చెందిన డైమండ్ ప్రిన్సెస్ అనే క్రూయిజ్ ప్రయాణికుల ఓడలోని వ్యక్తికి కరోనా వైరస్ సంక్రమించింది. ఆ వ్యక్తి ప్రయాణిస్తున్న ఓడలో 3,500 మందికి పైగా ప్రయాణికులు ఉండడం గమనార్హం. వీరిలో వెయ్యి మంది ఓడ సిబ్బందే ఉన్నారు. ఓడలోని ఓ వ్యక్తి హాంకాంగ్‌ లో దిగిపోగా.., ఆ 80 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్ సంక్రమించినట్లు నిర్ధరణ అయింది. దీంతో షిప్‌ లోని వారికీ ఈ వైరస్ వ్యాపించిందేమోననే అనుమానాలు వారికీ తలెత్తాయి. దింతో వారందరు భయాందోళనకు గురవుతున్నారు. 

 

దీంతో వారందరికీ కరోనా పరీక్షలు చేయాలనీ నిర్దారించారు. సోమవారం డైమండ్ ప్రిన్సెస్ ఓడ యోకోహమా పోర్టులో ఆగి ఉన్నప్పుడు వైద్య నిపుణులు పరీక్షల కోసం ఓడ లోకి ప్రవేశించారు. దీన్ని అక్కడే ఉన్న కొందరు స్థానిక జర్నలిస్టులు చిత్రీకరించారు. ఓడ 24 గంటలుగా ఆ తీరంలోనే ఉండిపోగా, అందులో నుంచి ఒక్క ప్రయాణికులను బయటకు అనుమతించడం లేదని బ్యాంకాక్ పోస్ట్ వార్తా సంస్థ వెల్లడించింది.

 

దీని పై జపాన్ ప్రభుత్వ ముఖ్య అధికార ప్రతినిధి దీనిపై స్పందిస్తూ.. ఆ షిప్‌ లో కరోనా వైరస్ పరీక్షలు జరుగుతున్నట్లు ధ్రువీకరించారు. ప్రయాణికులంతా వైద్య పరీక్షల కోసం తమ గదుల్లోనే తాము ఉండాలని, వైద్య నిపుణులు మీ గదుల్లోకి వచ్చి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తారని షిప్‌ లోని ఓ యువతి స్థానిక వార్తా సంస్థకు ఫోన్‌ లో వెల్లడించింది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జపాన్ పటిష్ఠ చర్యలు చేపట్టింది. చైనాతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధించింది. వుహాన్ లో ఉన్న తమ దేశీయులు దాదాపు 500 మందిని జపాన్ వెనక్కి తీసుకెళ్లింది.

మరింత సమాచారం తెలుసుకోండి: