దేశంలో ఎన్ని చ‌ట్టాలు వ‌చ్చినా కూడా ఆడ‌వారి పై జ‌రిగే అరాచ‌కాలు మాత్రం ఎక్క‌డా ఆగ‌డం లేదు.  చ‌ట్టాల‌ను సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదు. అలాగే బంధాలు బంధుత్వాల‌కు విలువ‌లు లేకుండా పోతున్నాయి. రోజు రోజుకీ మ‌గాడు మృగ‌మైపోతున్నాడు. అన్నాచెల్లి అన్న సంబంధాలు కూడా ఏమీ చూడ‌కుండా నీచాతి నీచంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఇటీవ‌లె ఇలాంటి ఘ‌ట‌న ఒక‌టి చోటు చేసుకుంది. 

 


తాజాగా చెల్లెలి పై అన్న వరసయ్యే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను బలవంతంగా బీచ్‌కి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయి విష‌యాన్ని ఎవ్వ‌రికీ చెప్పుకోలేక అలాగ‌ని అన్న వేధింపుల‌కు పాల్ప‌డుతున్నాడు. దాంతో అమె ఇంట్లో వారికి చెప్ప‌గా ఆమెను చ‌దువు మానిపించి బంధువుల వ‌ద్ద‌కు పంపించారు. అంద‌రూ క‌లిసి ఆ యువ‌కుడిని తిట్టి మంద‌లించి పంపించారు. బాలిక ఇంటికి వచ్చిందన్న విషయం తెలుసుకున్న అన్న.. అదను కోసం వేచి చూశాడు. ఆమె తల్లిదండ్రులు బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కి వెళ్లారని తెలుసుకుని గోడ దూకి మరీ ఇంట్లోకి వెళ్లాడు.  

 

అంతేకాక తిరిగి  మరోసారి అత్యాచారానికి తెగబడ్డాడు. ఫంక్షన్‌ నుంచి తిరిగొచ్చిన తల్లిదండ్రులకు బాలిక అస‌లు విషయం చెప్పడంతో వారు ఇక కోపాన్ని ఆపుకోలేక పోలీసులను ఆశ్రయించారు. ఇక ఈ మ‌ధ్య ఎక్కువ‌గా జ‌రుగుతున్న‌ట్లు పోలీసులు స‌రిగా స్పందించ‌క‌పోయే స‌రికి బాధితులు జిల్లా ఎస్పీ వ‌ద్ద‌కు వెళ్ళారు.  

 


త‌న కూతురు ప‌డే వేద‌న చూడ‌లేని త‌ల్లిదండ్రులు  పొన్నూరు రూరల్ పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తెపై గోపి అనే వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని.. చర్యలు తీసుకోవాలని స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే మరుసటి రోజు గోపి తనను రేప్ చేశాడని బాలిక చెప్పడంతో వెంటనే స్టేషన్‌కు చేరుకుని రేప్ కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. అయితే వారు నిర్ల‌క్ష్యం చేయ‌డంతో జిల్లా ఎస్పీని క‌లిసి బాధుతులు విష‌యం తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: