ఒకసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఫిబ్రవరి 6వ తేదీన ఎంతో మంది ప్రముఖులు జన్మించారు. మరి ఈ రోజు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.

 

 ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ జననం : బాద్షా ఖాన్ గా  సరిహద్దు గాంధీ గా పేరుగాంచిన స్వతంత్ర సమరయోధుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1890 ఫిబ్రవరి 6వ తేదీన జన్మించారు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గాంధేయవాది. అంతేకాకుండా భారతరత్న పురస్కారాన్ని పొందిన తొలి భారతేతరుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఎర్ర చొక్కల ఉద్యమం ప్రారంభించిన ప్రముఖుడు ఈ బాద్షా ఖాన్. భారత విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన వారి లో ఈయన ప్రముఖులు. భారత రాజకీయ నాయకులతో కలిసి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు ఈయన . ముఖ్యంగా గాంధీ నెహ్రూ మరియు కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాటం చేశారు. అయితే సరిహద్దు ప్రాంతంలోని ముస్లిం లీడర్లు అందరూ ఇతన్ని  ముస్లిం ద్రోహి అని హత్యాయత్నం కూడా చేశారు. అయితే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ దేశవిభజన ఆగలేదు దీంతో సరిహద్దు ముస్లింల అందరికీ ద్రోహిగా మారిపోయాడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. 

 

 విలియం పి  మర్ఫీ  జననం : రక్తహీనత వ్యాధికి చికిత్స ను కనుగొన్న శాస్త్రవేత్త విలియం పి  మర్ఫీ 1892 ఫిబ్రవరి 6వ తేదీన జన్మించారు. 

 

 భమిడిపాటి రామగోపాలం జననం: ప్రముఖ తెలుగు రచయిత పత్రికా సంపాదకుడు అయిన భమిడిపాటి రామగోపాలం 1932 ఫిబ్రవరి 6 వ తేదీన జన్మించారు. ఈయనకు ఆంధ్రపత్రిక అన్న రేడియో అన్న  ఎంతగానో ఇష్టం ఉండేది . కాగా ఈయన  78 ఏళ్ల వయసులో రెండు కాళ్లు వేళ్ళు పడిపోవడంతో... సహాయకులకు మౌఖికంగా చెబుతూ సాహితీ వ్యాసంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు భమిడిపాటి రామగోపాలం. చక్రాల కుర్చీకే పరిమితమైనా సాహిత్య వ్యాసంగం ఏ మాత్రం ఆపలేదు ఈయన . 2010 ఏప్రిల్ 7వ తేదీన భమిడిపాటి రాజగోపాల్ గుండెపోటుతో పరమపదించారు. 

 

 

 కె.వి.కృష్ణకుమారి జననం : తెలుగు రచయిత్రి సాహితీవేత్త గైనకాలజిస్టు అయినా కె.వి.కృష్ణకుమారి 1947 ఫిబ్రవరి 6వ తేదీన జన్మించారు. అయితే కె.వి.కృష్ణకుమారి అసలు వృత్తి మెడికల్ ప్రాక్టీషనర్ అయినప్పటికీ ప్రవృత్తి మాత్రం రచనా వ్యాసంగం. ఈమె తన పది సంవత్సరాల వయస్సు అప్పుడే రచనా వ్యాసంగాన్ని ప్రారంభించింది. ఈమె ఐదు దశాబ్దాలకు పైగా రచయిత్రిగా కొనసాగుతూ చిరస్మరణీయమైన గ్రంధాలను వెలువరించారు. ఈమె డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు కు ఆత్మీయురాలు, కుటుంబ సభ్యురాలు. కాగా  కృష్ణకుమారి ఆవిష్కరించిన మనిషిలో మనిషి అన్న గ్రంథం ఇప్పటికీ బహుళ ప్రజాదరణ పొందుతోంది. అంతేకాకుండా పుట్టపర్తి సాయిబాబా మీద రాసినటువంటి అద్వైతామృత వర్షిని అనే గ్రంధం కూడా ఎంతో మంది భక్తులు అమితంగా ఇష్టపడుతుంటారు. 

 

 కావలి ప్రతిభాభారతి జననం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు కావలి ప్రతిభాభారతి 1956 ఫిబ్రవరి 6వ తేదీన జన్మించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ మొట్ట మొదటి మహిళా అధ్యక్షురాలిగా రికార్డు సృష్టించారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కూడా కావలి ప్రతిభా భారతి పనిచేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున కీలక నేతగా ఎదిగిన కావలి ప్రతిభాభారతి పలుమార్లు మంత్రి పదవులు చేపట్టడమే కాదు అసెంబ్లీ స్పీకర్ గా కూడా కొనసాగారు. ఓ దళిత కుటుంబం నుంచి వచ్చినా కావలి ప్రతిభాభారతి రాజకీయంగా ఎంతగానో ఎదిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: