ఆ వరుడు పెళ్లిమండపంలోకి అడుగుపెట్టాడు అంతే.. కాల్చేశారు. ఈ దారుణమైన షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మరికొద్ది సమయంలో పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఆ వరుడుని దుండగులు దారుణంగా కాల్చి చంపేశారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. 

                    

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సింగ్‌పూర్ ప్రాంతం నుండి పెళ్లి మండపానికి పెళ్లి ఊరేగింపులోచేరుకున్నాడు. అయితే సరిగ్గా ఉరిగింపు అయిపోయి పెళ్లి మండపానికి నడిచి వస్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు అపరిచితులు నవ వరుడిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి అక్కడ నుండి పారిపోయారు. 

                         

అయితే ఆ ఘటన చుసిన స్థానికులు షాక్ గురై అక్కడ కాల్పులకు గురైన వరుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వరుడు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన బంధువులు వరుడు ఇంటి ముందే ఆందోళనకు దిగారు.. దింతో పోలీసులు రంగంలోకి దిగి అక్కడ పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. 

                                         

అనంతరం వరుడు మృతుదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మరో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.. అయితే ఈ ఘటనకు సంబంధించి వరుడు, వధువు కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకొని విచారించడం ప్రారంభించారు. అయితే సీసీటీవీ కెమెరాలు చెక్ చేసిన పోలీసులు హంతకులు పెళ్లి ఊరేగింపులో కొద్ది దూరం నుండి వెంబడించినట్టు గుర్తించారు.. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: