ఏపీలోని నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక స్కూల్ బస్ డ్రైవర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిని స్కూల్ బస్ లో నగర శివారు ప్రాంతానికి తీసుకెళ్లి డ్రైవర్ శివ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. డ్రైవర్ శివను స్థానికులు చితకబాదారు. ఆ తరువాత డ్రైవర్ ను స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఆగ్రహంతో స్థానికులు స్కూల్ బస్సును తగులబెట్టారు. 
 
బాధితురాలు విద్యావిహార్ స్కూల్ కు చెందిన విద్యార్థినిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలలోకి వెళితే విద్యా విహార్ స్కూల్ లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిని అదే స్కూల్ లో డ్రైవర్ గా పని చేస్తున్న శివ అనే 35 సంవత్సరాల వయస్సు కల వ్యక్తి విద్యార్థినిని దీన్ దయాల్ నగర్ సమాధుల దగ్గరకు తీసుకెళ్లి అత్యాచారం చేస్తున్న సమయంలో స్థానికులు గమనించి శివకు దేహశుద్ధి చేశారు. 
 
ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులు పాఠశాల దగ్గరకు చేరుకొని ఆందోళనకు దిగినట్టు సమాచారం. ఈ మధ్య కాలంలో నెల్లూరు నగరంలో మైనర్ బాలికలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. గత వారం రోజులలో మైనర్ బాలికలపై అత్యాచారానికి సంబంధించిన నాలుగు ఘటనలు నెల్లూరులో వెలుగులోకి వచ్చాయి. 18 నెలల నుండి శివ పాఠశాల బస్ కు డ్రైవర్ గా పని చేస్తున్నాడని తెలుస్తోంది. 
 
శివ ఎప్పుడూ మద్యం మత్తులోనే ఉండి డ్రైవింగ్ చేస్తాడని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులు గతంలోనే శివ గురించి ఫిర్యాదు చేసినప్పటికీ స్కూల్ యాజమాన్యం పెద్దగా ఈ విషయం గురించి పట్టించుకోలేదని తెలుస్తోంది. స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమైందని స్థానికులు, తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.       

మరింత సమాచారం తెలుసుకోండి: