ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సంచలనం సృష్టించిన వరుస హత్యల నిందితుడైన సైకో శ్రీనివాస రెడ్డికి నేడు శిక్ష ఖరారు కునుంది. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌కి చెందిన మర్రి శ్రీనివాస రెడ్డి లిఫ్టు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు., కాగా అతడు ఇప్పటి వరకూ నాలుగు మర్డర్లు చేశాడు, అలానే అతడిపై ఒక లైంగిక వేధింపుల కేసు ఉంది. ఇటీవల హాజీపూర్‌కి చెందిన 14 ఏళ్ల అమ్మాయి స్కూలుకు వెళ్లి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆ కేసుతోనే మొత్తం శ్రీనివాస రెడ్డి బండారం బట్టబలయింది. స్కూల్ నుంచి హాజీపూర్‌లోని తన ఇంటికి వెళ్లేందుకు ఎదురుచూస్తున్న బాలిక ఒక  చెట్టు దగ్గర నిలబడి ఉండగా, అది గమనించి అక్కడకు వచ్చిన శ్రీనివాస్, ఆమెకు లిఫ్టు ఇస్తానని నమ్మబలికి బైక్ ఎక్కించుకుని, రోడ్డు పక్కనే ఉన్న తన పొలం వద్దకు తీసుకెళ్లి ఆమెకు ఊపిరాడకుండా చేసి, బావిలో పడేశాడు. తర్వాత తాను కూడా బావిలోకి దిగి వెళ్లి ఆమెపై లైంగిక దాడి చేశాడు.

 

తర్వాత చంపేసి అక్కడే పూడ్చి పెట్టాడు. బాలిక తల్లితండ్రులు పెట్టిన కేసుతో అతడి నేర చరిత్ర మొత్తం బయట పడింది. కాగా అతడి వలన నష్టపోయిన బాధిత కుటుంబాలతో పాటు ఉదయం నుంచి హాజీపూర్ గ్రామస్తులు, కూడా తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. నేరం రుజువైందని కోర్టు చెప్పడంతో బాధిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ తీర్పును ఎలా వస్తుందనే దానిపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే అతడు మాత్రం కోర్టులో ప్లేటు ఫిరాయించినట్లు తెలుస్తోంది.

 

తనకు ఈ నేరాలతో ఎటువంటి సంబంధం లేదని, కావాలనే తనను పోలీసులు ఇరికించారని, అంతేకాక తనను ఎంతో క్రూరంగా కొట్టిన పోలీసులు తన ఆస్థి, డబ్బును కూడా లాగేసుకున్నారని తన గోడు విన్నవించుకున్నాడు. అంతేకాక తనను నమ్ముకుని ఉన్న తల్లితండ్రులను తానే చోసుకోవాలని చెప్పగా, వారు ఎక్కడ ఉన్నారో చెపితే ప్రభుత్వం వారికి సాయం అందిస్తుంది అని జడ్జి గారు అడుగగా, వారు ఎక్కడ ఉన్నారో తనకు తెలియదని అన్నాడు. అయితే జరిగిన హత్య ప్రదేశాల్లో పక్కాగా అతడి నమూనాలు, డీఎన్ఏ, రక్త పరీక్షలు, పోస్టుమార్టం రిపోర్టు, సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు అన్నీ అతడివే అని తేలడంతో అతడు తప్పించుకునేందుకు అబద్దాలు చెప్తున్నట్లు పోలీసులు తెలిపారు. దానితో అతడి నేరం పూర్తిగా రుజువు కాబడింది. అయితే ఎటువంటి శిక్ష పడుతుంది అనెదిమాత్రం తెలియాల్సి ఉంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: