టాలీవుడ్ లో సినీ ప్రేక్షకులకు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ కొరత ఉండదు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే మిగతా ఇండస్ట్రీలో కంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు ఎక్కువ మంది ఉంటారు. అందుకే ఏదో ఒక హీరో సినిమా విడుదల అవుతూ ఉంటుంది. ఇప్పటికే సంక్రాంతి కానుకగా ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో  ఎక్కువగా సరిలేరు నీకెవ్వరు అల  వైకుంఠపురములో సినిమాలు సత్తా చాటాయి . ఫిబ్రవరి నెలలో కూడా ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదలవ్వగా... విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు కూడా చాలానే ఉంది. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో విడుదల అవ్వడానికి ఎన్నో సినిమాలు సిద్ధంగా ఉన్నప్పటికీ... ప్రేక్షకులందరూ చూపు మాత్రం జాను, వరల్డ్ ఫేమస్ లవర్  భీష్మ వంటి సినిమాల వైపే  ఫేక్షకుల చూపు  ఉన్నది. 

 

 

అయితే బాక్సాఫీస్ వద్ద ఎన్ని  సినిమాలు విడుదల అయినప్పటికీ కూడా ఒకటో రెండో  సినిమాలు  మాత్రమే విజయాన్ని సాధిస్తున్నాయి . ఇక ఫిబ్రవరిలో విడుదల కాబోతున్న వరల్డ్ ఫేమస్ జాను భీష్మ వంటి సినిమాలు మాత్రమే ప్రేక్షకులకు  ఆకట్టుకునే స్థాయి ఉంది అంటూ అటు సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఈ మూడు సినిమాల్లో కూడా నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా నటించిన భీష్మ సినిమా తప్పితే మిగతా రెండు సినిమాలకు అంతగా బజ్ లేదని చిత్ర వర్గాలు కూడా అంటున్నాయి. ఒకవేళ ప్రేక్షకుల్లో ఇప్పటికే కొంచెం బజ్ క్రెయేట్  చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న భీష్మ సినిమాలో కూడా ఆకట్టుకునే అంశాలు లేకపోతే మాత్రం... అది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు. 

 

 

 కాగా ఫిబ్రవరి నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్న జాను వరల్డ్ ఫేమస్ లవర్ భీష్మ  సినిమా లపై  కూడా పెద్దగా అంచనాలు లేవు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. అది తెలియాలంటే ఈ మూడు సినిమాలు విడుదల అయ్యే అంతవరకు వేచి చూడాల్సిందే మరి. కాగా జాను  సినిమాలో శర్వానంద్  సమంత కలిసి నటిస్తున్నారు... భీష్మ సినిమాలో నితిన్ రష్మిక మందన నటిస్తున్నారు. ఇక వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రాసి కన్నా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: