ఈ మద్య ఎక్కడ చూసినా చిన్నా, పెద్దా వయసు తేడా లేకుండా కామామంధులు ఆడవారిని చూస్తే రెచ్చిపోతున్నారు.  అత్యాచారాలు చేయడమే కాదు.. దారుణంగా వారిని హతమారుస్తున్నారు.  గత ఏడేళ్లుగా దేశ రాజధానిలో జరిగిన దారుణమైన ఘటన నిర్భయ కేసు విషయంలో ఉరిశిక్ష పడ్డవారికి రేపూ..మాపు అంటూ వస్తున్నారు.  ఈ మద్య దిశ కేసులో నలుగురు నింధితులు ఎన్ కౌంటర్ లో మరణించిన విషయం తెలిసిందే. ఇక సమత హత్య కేసులో ముగ్గురు నింధితులకు ఉరిశిక్ష ఖరారు చేశారు.  దేశంలో ఇన్ని జరుగుతున్నా.. కొంత మంది కామాంధులు మాత్రం అస్సలు మారడం లేదు. తాజాగా కృష్ణా జిల్లా కలిదిండి మండలంలోని గోపాలపురంలో దారుణం జరిగింది. 10 ఏళ్ల బాలికపై 65 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. 

 

అయితే తన స్నేహితురాళ్లతో ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారి ఎంత సేపటికీ రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు చుట్టు పక్కల అంతటా వెదికారు.కానీ ఎక్కడా తమ బిడ్డ కనిపించకపోవటంతో వారి భయం మరింతగా పెరిగింది.  అయితే చుట్టు పక్కల వారిని అడగటంతో... స్థానికంగా ఉండే బ్రహ్మయ్య అనే వృద్ధుడు ఆరుబైట ఆడుకుని పాపను బ్రహ్మయ్య తన ఇంటికి తీసుకెళ్లాడని స్థానికులు చెప్పారు. అయితే ఆ దుర్మార్గుడు చిన్నారిని తీసుకు వెళ్లి అత్యాచారానికి వడిగట్టాడు.  పట్టుమని 10 ఏళ్ల తన చిట్టితల్లి బ్రహ్మయ్య అనే కామాంధుదుడి చేతిలో నరకం అనుభవించి అత్యాచారానికి గురైందని తెలుసుకుని తల్లి  తల్లడిల్లిపోయింది. 

 

వృద్ధుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆరుబైట ఆడుకునే తన బిడ్డను ఎత్తుకెళ్లి బ్రహ్మయ్య అత్యాచారం చేశాడని.. దానికి అతను కొడుకు కూడా సహకరించాడని పోలీసులకు తెలిపింది.  కేసు నమోదు పోలీసులు బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా, ఈ దారుణ ఘటనలో రక్తస్రావం అయిన బాలికను హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. దేశంలో ఎన్ని కఠిన శిక్షలు పడుతున్నా... కామాంధుల్లో మార్పు రావడం లేదని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: