స్నేహని కన్నా మిన్న లోకాన లేదురా అన్నాడు ఓ మహా కవి. స్నేహానికి భాషతో సంబంధం లేదు. స్నేహానికి కులం, మతం, హోదాతో పని లేదు. బంధుత్వం కన్నా విలువైంది. తల్లిదండ్రుల దగ్గర చూపుకోలేని విషయాన్ని కూడా ఒక్క స్నేహితుడు దగ్గరే పంచుకుంటాం.  స్నేహితులే ఈ రోజుల్లో నమ్మించి మోసం చేసి, నాటెట్లో ముంచేస్తున్నారు. అలాంటి స్నేహితుడే ప్రాణాలను తీసేందుకు కూడా వెనుకాడడం లేదు. స్నేహితులే వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. 


స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం చినికిచినికి కత్తులతో దాడి చేశారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గంజాయి కోసం యువకుడిని కత్తితో పొడిచిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. మత్తు కోసం ముగ్గురు స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం కత్తిపోట్లకు దారితీసింది. గంజాయి విషయంలో మాటామాటా పెరిగి స్నేహితుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఉన్మాదులుగా మారిన ఇద్దరు యువకులు స్నేహితుడిపై విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేశారు. ఈ దారుణ ఘటన మల్కాజ్‌గిరిలో కలకలం రేపింది.

 

మల్కాజిగిరి పోలిస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్ నగర్‌లో గంజాయి బాబులు వీరంగం సృష్టించారు. గంజాయి విషయంలో ముగ్గురు స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది. మాటామాటా పెరిగి కత్తులతో దాడి చేసుకునే వరకూ వెళ్లింది. కెల్విన్ రాజు, మహేందర్, మున్నా మధ్య గంజాయి విషయమై ఘర్షణ జరిగింది. ఆగ్రహానికి లోనైన కెల్విన్ రాజు, మహేందర్ ఆవేశంతో మున్నాను కత్తితో పొడిచేశారు.

 

మున్నాను కత్తితో పొడిచేసిన స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. నిందితులు కెల్విన్ రాజు, మహేందర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేశారు. [పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: