ఆఫీసులో, బస్సుల్లో, పనిచేస్తున్న ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ రోజుకో కేసు వస్తూనే ఉంటుంది. ఆ కేసుల పరిష్కారమై ఏం చేయాలా అని ఆలోచిస్తున్న ప్రభుత్వానికి మరో కొత్త రకం కేసులు వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి. ఆ కేసుల పరిష్కారమైఅ రోజుకో చట్టం వస్తూనే ఉంది. అయినా కూడా వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. మహిళల మీద జరిగే వేధింపుల కేసులే మనల్ని ఇబ్బంది పెడుతూంటే ఇప్పుడు కొత్తగా మగాళ్ళ మీద కూడా లైంగిక వేధింపులు స్టార్ట్ అయ్యాయి. 

 

 

ఎప్పుడూ మహిళల మీద జరిగే లైంగిక వేధింపులు, ఈ సారి విచిత్రంగా ఒక మహిళే బాలుడిపై లైంగికంగా వేధించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అవును మీరు చదువుతున్నది నిజమే.. ఒక మహిళ బాలుడిని లైంగికంగా వేధించిన కేసు చత్తీస్ ఘడ్ లో జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో 27 ఏళ్ల మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త పిల్లలతో చక్కగా కాపురం చేసుకోకుండా పక్కనే ఉన్న ఇంటర్ చదువుతున్న బాలుడి మీద కన్నేసింది. 

 

 

ఇంటి పొరుగున ఉండే 17 ఏళ్ల బాలుడి మీద మనసు పారేసుకున్న ఆ మహిళ బాలుడు ఒంటరిగా కనిపించిన ప్రతీసారి అతనితో చిలిపిగా మాట్లాడటమే కాకుండా శృంగార పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది. అక్కడితో ఆగకుండా ఇంకా విజృంభించింది. లేచిపోదాం రమ్మని ఆ బాలుడిని కోరడంతో ఆ బాలుడికి ఏం చేయాలో అర్థం కాక మనస్తాపానికి గురయ్యాడు. ఆ మనస్తాపాన్ని గమనించిన తల్లిదండ్రులు ఏమైందని అడిగే సరికి జరిగిన విషయం చెప్పుకొచ్చాడు. 

 

 

నేను ఏ తప్పు చేయలేదు నాన్నా అంతా ఆంటీనే, నాకు కొత్త క్లాసులు చెప్తుంది అంటూ మేటర్ చెప్పగానే ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయగానే పోలీసులు రంగంలోకి దిగగా ఆమె నిజం ఒప్పుకుంది. భర్త ఇష్టం లేక బాలుడ్ని ప్రేమించా అని చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: