వివాహ బంధాలు బలంగా కొనసాగటం లేదని ప్రతిరోజు చూస్తున్న సంఘటనలను చూస్తుంటే తెలుస్తోంది. భార్యలను చంపుతున్న భర్తలు.. భర్తలను చంపుతున్న భార్యలు నేటి సమాజంలో కోకొల్లలు. అభం శుభం తెలియని పిల్లల మాత్రం తమ తల్లిదండ్రులు చేసిన నేరాలకు బలవుతున్నారు. ఎక్కడ చూసినా ఇలాంటి సంఘటనలే జరిగి కలకలం రేపుతున్నాయి. తాజాగా విశాఖ నగరంలో జరిగిన హత్య ఒకటి అందరిని విస్తుపోయేలా చేస్తోంది.


వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రాంతానికి చెందిన జోగి శ్రీనివాసరావు.. విశాఖ ఊర్వశి కూడలి ప్రాంతానికి చెందిన మైలపల్లి భారతి(28) ఘాడంగా ప్రేమించుకొని పదేళ్ల క్రితం పెళ్లి కూడా చేసుకున్నారు. వీరి పదేళ్ల వివాహబంధంలో ఇద్దరు కుమార్తెలు జన్మించారు. అయితే ప్రస్తుతం వీరి కుటుంబం అంతా విశాఖ నగరంలోని మధురవాడ వాంబేకాలనీ 15వ బ్లాక్ లో నివసిస్తున్నారు. భర్త శ్రీనివాసరావు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుండగా.. భార్య భారతి ఇంటి వద్ద టైలరింగ్ చేస్తూ తాను కూడా కొంత డబ్బును సంపాదించి భర్తకు చేదోడువాదోడుగా నిలుస్తుంది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా భార్యపై శ్రీనివాస రావు అనుమానం పెంచుకున్నాడు. టైలరింగ్ చేస్తూ ఇంట్లోనే ఉంటున్న భార్య భారతి ఎవరితోనే అక్రమ సంబంధం పెట్టుకుందని పిచ్చిగా అభిమానిస్తూ విపరీతంగా వేధించే వాడు. తాను ఏమి తప్పు చేయకపోయినా.. భర్త అనుమానిస్తూ వేధిస్తుండడంతో ఆమె తట్టుకోలేక తన పుట్టింటికి పిల్లల్ని తీసుకొని వెళ్లి పోయింది.


బుధవారం నాడు అత్తారింటికి వెళ్ళిన భర్త శ్రీనివాసరావు.. భార్యను వేధించనని తన అత్తమామలను నమ్మబలికి ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. కానీ, ఆరోజు రాత్రి మళ్లీ భార్యను వేధించడం మొదలుపెట్టాడు శ్రీనివాసరావు. తర్వాత వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సందర్భంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీనివాస రావు భారతి మెడ చుట్టూ ఒక తాడు ని గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి ఆమెను హతమార్చాడు. ఈ హత్య గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శ్రీనివాస రావుని అరెస్టు చేశారు. తల్లి మరణంతో, తండ్రి జైలు పాలు అవ్వడంతో.. వీళ్ళిద్దరికి పుట్టిన ఇద్దరు బాలికలు అనాధలయ్యారు. కేవలం అనుమానం పిచ్చితో ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యను హతమార్చి... తన పిల్లల్ని అనాధలుగా మార్చిన శ్రీనివాసరావుకు కఠినంగా శిక్ష పడాలని మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: