మహిళలపై రోజురోజుకూ లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. మహిళలపై దాడి చేసే వారిని శిక్షించేందుకు ఎన్ని కటిన చట్టాలు తీసుకొచ్చినా ఇప్పటికీ ఆకతాయిలు మాత్రం అసలు పట్టించుకోవడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి మహిళలపై అత్యాచారాలు చేసి హత్య చేసే వారు కొందరైతే... ఒంటరిగా ఉన్న మహిళలను చూసి అసభ్యంగా ప్రవర్తించి మనస్థాపం చెంది మహిళ ఆత్మహత్య చేసుకునేలా ప్రవర్తించే వారు ఇంకొందరు... వెరసి మహిళలపై రోజురోజుకూ లైంగిక వేధింపులు మాత్రం పెరిగిపోతున్నాయి. మహిళలకు రక్షణ కల్పించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఆకతాయిల బారినుంచి మహిళలను రక్షించ లేకపోతున్నారు. ఎక్కడో ఓ చోట కామాంధుల బారినపడి మహిళలు లైంగిక వేధింపులకు గురవడం లేదా అత్యాచారాలకు రావడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 

 

 ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. తాజాగా ఓ రైల్వేస్టేషన్లో కాపు కాచి ఉన్న ఓ వ్యక్తి రైల్వే స్టేషన్ లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై లైంగిక దాడి చేశాడు. దీంతో బెంబేలెత్తిన పోయినా ఆ యువతి పరుగులు తీసింది. ముంబైలోని ఓ రైల్వే స్టేషన్ సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. నిర్మానుష్యంగా ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి పై మాటేసిన పోకిరి... అటువైపుగా   అమ్మాయి ఒంటరిగా నడుచుకుంటూ వెళితే చాలు... ఎక్కడపడితే అక్కడ అసభ్యంగా తాగుతూ... ముద్దులు పెడుతూ లైంగికంగా వేధించేవాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆ రైల్వే బ్రిడ్జి పై ఓ యువతి ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న సమయంలో అక్కడే మాటు వేసి ఉన్న పోకిరి ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టే అక్కడి నుంచి పరారయ్యాడు. 

 


 అప్పటికే ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న ఆ అమ్మాయి ఊహించని ఘటన తో తీవ్ర భయాందోళనకు గురి అయింది. దీంతో అక్కడి నుంచి స్పీడ్ గా వెళ్లి పోయింది. ఎక్కడ తనపై లైంగిక దాడికి దిగిన పోకిరి వెంటాడుతున్నాడేమో అనీ  భయం భయంగానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ యువతి. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయయి . ఇంతకీ ఈ ఘటన జరిగింది ఏదో రాత్రి  సమయంలో అనుకునేరు పట్టపగలే ఇలాంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనపై ఇంతవరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు రాకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: