ఎన్టీఆర్, ఏఎన్నార్ తరువాత ఆ స్థాయిలో తెలుగు సినీ ఇండ్రస్ట్రీలో అప్పటికి ఇప్పటికి పేరు పొందిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క చిరంజీవి మాత్రమే. ఆయన డాన్స్, నటన ఇలా ఎందులోనూ ఆయనకు పేరు పెట్టేందుకు వీలు పడదు. స్వశక్తితో పైకి వచ్చిన వ్యక్తిగా చిరంజీవి జీవితం అందరికి ఆదర్శం. అయితే ఇప్పుడు చిరంజీవి కి సంబంధించి షాకింగ్ న్యూస్ బయటపడింది. అదేంటి అంటే చిరంజీవిపై విష ప్రయోగం జరిగింది అనేది. అయితే ఇదంతా ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల క్రితం. కాకపోతే ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. దీనికి సంబందించిన న్యూస్ క్లిప్పింగ్ సర్కులేట్ అవుతోంది. దీంతో మెగా అభిమానుల్లో ఒకటే కలకలం మొదలయ్యింది. 

 

 అసలు అప్పట్లో ఈ న్యూస్ రావడం వెనుక కారణాలు కూడా చాలానే కనిపిస్తున్నాయి. 1988 లో జరిగిన ఈ సంఘటనకు ఓ అభిమాని అత్యుత్సాహమే కారణంగా తెలుస్తోంది. ఆ  పొరపాట్లు కారణం ఏదైనా మెగాస్టార్ పై విష ప్రయోగం జరిగింది అనే అనుమానాలు బలపడడానికి కారణం అయ్యింది. ఇదంతా ఆయన ఎదుగుదలను సహించలేని వాళ్ల కుట్ర అంటూ అప్పట్లో ప్రచారం సాగిపోయింది. దినపత్రికలు అప్పట్లో దీనిని హైలైట్ చేస్తూ వార్తలు ప్రచురించడంతో ప్రజల్లోనూ హాట్ టాపిక్ అయ్యింది. అప్పటికే నంబర్ 1 హీరో గా వెలుగుతున్న చిరంజీవి 1988లో మరణ మృదంగం సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ రోజు మద్రాస్ బేస్ కోర్ట్ లో షూటింగ్ జరుగుతోంది. 


అక్కడికి 200 మంది పైగా అభిమానులు వచ్చారు . ఇక అభిమానులంతా చిరుతో ఆటోగ్రాఫ్ కోసం పోటా పోటీగా ప్రయత్నించారు. అలా వచ్చిన అభిమానుల్లో ఓ అభిమాని ఈ రోజు నా పుట్టినరోజు ఎప్పటి నుంచో మీ సమక్షంలో కేక్ కట్ చేయాలని అనుకుంటున్నాను అంటూ ముందుకొచ్చాడు. దానికి చిరు సంతోషం గా ఆహ్వానించారు. ఒక కేక్ ముక్క కట్ చేసి అభిమాని ఆ ముక్కను వెంటనే చిరుకి తినిపించ బోయాడు. అయితే అతడిని వారించిన చిరు ఈ రోజు బర్త్ డే బోయ్ నువ్వు కదా నువ్వు తినాలి అంటూ ఆ కేక్ ను అంతానికి తినిపించబోయాడు. కానీ ఆ అభిమాని మొండిగా చిరు నోట్లోనే కేక్ పెట్టేసేందుకు ప్రయతించాడు. దీంతో అది కాస్తా ఎవరికీకీ కాకుండా నేల మీద పడింది. 


అలా నేలపై పడిన ఆ కేక్ ముక్కలో గోధుమ రంగులో ఓ చిన్న ప్యాకెట్ బయటపడింది. దాంతో మరణ మృదంగం చిత్ర యూనిట్ కంగారు పడింది. ఇదేదో విషప్రయోగంగా భావించి ఆ అభిమానిని పట్టుకుని దేహశుద్ది చేశారు. అంతే కాకుండా అతగాడిని పోలీసులకు అప్పగించారు. కింద పడిన ఆ ప్యాకెట్ ని ల్యాబ్ లో చెక్ చేయించారట. అయితే అది విషమా కాదా? అనేది ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. అప్పటి మ్యాగజైన్లు దీనిపై విపరీతంగా ప్రచారం చేశాయి. మెగాస్టార్ చిరంజీవిపై విష ప్రయోగం జరిగిందని, ఆయన నంబర్ వన్ గా ఎదగడం ఇష్టం లేని వాళ్లు కుట్ర పన్నారని, అన్ని ప్రముఖ దినపత్రికలు ప్రచురించేయడంతో బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇదంతా 1988 సంవత్సరంలో. ఇప్పుడు దానికి సంబందించిన ఫోటో వైరల్ గా సర్కులేట్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: