ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకానికి కొత్తగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొన్ని మార్పులు చేశారు. ప్రభుత్వ పత్స్యలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికరమైన భోజనాన్ని అందించడం కోసమే కొన్ని మార్పులు చేశామని చెప్పారు. దీని కోసం మధ్యాహ్న భోజనం మెనులో మార్పులు చేసి సరికొత్త మెనూను తయారు చేశారు. పిల్లకు క్వాలిటీ ఆహారం అందించడం కోసమే మార్పులు చేసినట్లు వారు తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద పిల్లలు కూడా మంచి భోజనం చేస్తున్నారని ఆయన తెలిపారు. మెనూ మార్పులతో పేద పిల్లలు కూడా ఆరోగ్యాంగా ఉంటారని ఈ సంధర్బంగా ఆయన తెలిపారు. 

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పలు పథకాలను అమలు చేస్తుంది. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి పేరు మార్చి, ఆ పథకానికి జగనన్న గోరుముద్ద పథకంగా పేరు మార్చారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. ఎమ్మెల్యే రోజా తన నియోజకవర్గం పరిధిలో నగరిలోని ఒక పాఠశాలలో తనిఖీ చేశారు. ఆమె పిల్లలకు పెడుతోన్న భోజనంలో నాణ్యతపై తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఆమె స్వయంగా భోజనం వడ్డించి, ఆ తర్వాత వారితో కలిసి బంతిలో కూర్చొని భోజనం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు అందించే భోజన పథకానికి 'జగనన్న గోరుముద్ద'గా ఇటీవల పేరు పెట్టిన విషయం అందరికి తెలిసిందే. 

 

 

అయితే ఆ విషయం సందర్భాంగా రోజా మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు భోజనం వడ్డించిన విషయానికి సంబంధించిన వీడియోను ప్రస్తుతం ఫేస్‌బుక్, యూట్యూబ్ చెక్కర్లు కొడుతుంది. అయితే బడి పిల్లలకు స్వయంగా భోజనం వడ్డించిన ఎమ్మెల్యే రోజా 'మీరు గ్రేట్ మేడం' అంటోన్న నెటిజన్లు అభినందల జల్లు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: