మొదటి భార్య పెళ్లి చేసుకున్న కొద్దీ రోజులకే జంప్ అయింది.. సరేలే అని తోడుగా ఉంటుందని రెండో పెళ్లి చేసుకున్నాడు. సంతోషంగా సంసారం చేసుకుందామని తెగ సంబరాలు చేసుకున్నారు. దానితో అతనికి ఆశల మీద నీళ్లు పోసింది రెండో పెళ్ళాము. రోజుకో విదంగా భర్తను వేధించడం చేస్తూ వచ్చింది .

 

ఆ మహిళా దానితో అతను ఒక వీడియో చేసి టిక్ టాక్ లో వీడియో పోస్ట్ చేసి మరి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని దావణగెరె సమీపంలోని మాగనహళ్ళి గ్రామంలో నాగరాజ్ అలియాస్ రాజు (34) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం నాగరాజ్ కుటుంబ సభ్యులు చూసిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

 

మొదట భార్య, కుమార్తెతో సంతోషంగా ఉన్న నాగరాజ్ ఇంటిలో సమస్యలు మొదలైనాయి. తరువాత భర్త నాగరాజ్ ను వదిలేసిన మొదటి భార్య ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే రెండో పెళ్లిచేసుకున్న నాగరాజు కొంతకాలం ఆమెతో సంతోషంగా ఉన్నాడు.ఆమెతో ఇద్దరు కుమార్తెలు కలిగారు. అయితే గతకొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలున్నాయని అంటున్నారు. రోజు ఏదొక విషయంలో గొడవలు పడటం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కలిసి పరిష్కరిస్తే మళ్ళీ కొద్దిరోజులు బాగా ఉండటం ఆమెతో గొడవలు పడటం చేస్తున్నారని వార్తలు వినపడుడుతున్నాయి.

 

 

గొడవలు ఎక్కువ కావడంతో అతను విసిగిపోయి చనిపోదామనుకొని నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలో తన భార్య వల్ల తానూ చనిపోతున్నానంటూ ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనంతరం అతను ఆత్మహత్య చేసుకున్నాడు.నా రెండో భార్య వేదింపుతలతో నేను తట్టుకోలేకపోతున్నానని ఆరోపిస్తూ ఆ భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో భార్య వేదింపులతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని భర్త టిక్ టాక్ లో అప్ లోడ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: